తిరుమలలో ఒంటరిగా స్నేహ రెడ్డి.. అదే కారణమా..!?

Anilkumar
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన పిల్లలకి సంబంధించిన విషయాలను సైతం ఎల్లప్పుడూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది ఈమె. అయితే మొన్న ఆ మధ్య అల్లు స్నేహారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అయితే అల్లు స్నేహారెడ్డి ఒక్కరే తిరుమలకు వెళ్ళింది. ప్రస్తుతం వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా నెలలో ఖచ్చితంగా రెండు మూడు సార్లు అయినా సరే తిరుమల కి వెళ్లి వస్తుంది స్నేహ రెడ్డి. ఇటీవల తన కూతురు అల్లు అర్హ తో తిరుమలలో కనిపించింది.

కానీ ఇప్పుడు మాత్రం కూతురుతో వెళ్ళిన కొద్ది రోజులకే మళ్లీ ఒంటరిగా తిరుమలకు వెళ్లి వచ్చింది. సాధారణంగా ఎవరైనా సరే నెలలో ఒకటి రెండు సార్లు వెళతారు. కానీ అల్లు స్నేహారెడ్డి మాత్రం వరుసగా నచ్చినపుడు తిరుమల కి వెళ్లి వస్తుంది. ఈ క్రమంలోనే అల్లు స్నేహారెడ్డి ఎందుకు ఇలా ఊరికే తిరుమల దర్శించుకుంటుంది అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే స్నేహా రెడ్డి ఒక్కటే తిరుమలకు వెళ్లడం ఏంటి? అనే ప్రశ్నలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి..తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఎక్కువమంది విజిట్ చేసే హిందూ దేవాలయం. ఇక్కడ 365 రోజులు భక్తులు వస్తూనే ఉంటారు.

ఎక్కడెక్కడి నుంచే భక్తులు వచ్చి వెంకన్నను దర్శనం చేసుకుంటారు.. సినీ ఇండస్ట్రీ నుండి కూడా చాలామంది సెలబ్రిటీలు వెళ్తూ ఉంటారు. ఇక బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కూడా తిరుమల కి ప్రతిసారి వస్తూ ఉంటుంది.. అలాగే స్నేహా రెడ్డి కూడా వెళ్తుంది. అయితే ఈమె ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు ఆ పనిలో విజయం సాధించాలని వెళ్తుందట.. అలాగే ఆ పని పూర్తి అయితే మళ్లీ వెళ్తుందట.. ఇలా ఆమె నెలకు రెండు మూడు సార్లు తిరుమల దర్శనానికి వెళ్తుందని సమాచారం.. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: