న్యూయార్క్ టైం స్క్వేర్స్ పై చిరంజీవి ఫోటో

Anilkumar
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోని సినీ, కళారంగం, విద్య, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందిస్తుంది. ప్రతి ఏటా రిపబ్లిక్‌డే సందర్భంగా ప్రకటించే ఈ అవార్డులకు మన తెలుగు తేజాలు ఉండటం విశేషం. ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి పద్మవిభూషణ్‌ వరించాయి. ఇక కళారంగంలో అందించిన విశేష సేవలకు గానూ మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్‌ వరించింది.  చిరంజీవికి పద్మభూషణ్ గౌరవం దక్కడం పట్ల న్యూయార్క్ చెందిన అభిమాని మెగాస్టార్ కి వినూత్నంగా అభినందనలు తెలియజేశారు.

ప్రఖ్యాత న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో మెగాస్టార్ ఫోటో ని ప్రదర్శించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. కుందవరపు శ్రీనివాస్ నాయుడు అనే ఎన్నారై తన అభిమాన హీరో చిరంజీవికి పద్మ విభూషణ్ వరించడంతో శుభాకాంక్షలు తెలియజేస్తూ చిరంజీవి ఫోటోలు న్యూయార్క్ టైం స్క్వేర్ పై ప్రదర్శనకు పెట్టాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. న్యూయార్క్ టైం స్క్వేర్ పై మెగాస్టార్ ఫోటోలు చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
'బింబిసార' మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కునున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రల్ లో ఉండబోతోంది. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ. 200 కోట్లతో తెరకెక్కించబోతున్నట్లు 

టాక్ వినిపిస్తోంది. ఇక ఇటీవలే ఈ మూవీకి విశ్వంభర అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో నుంచి భారీ రెస్పాన్స్ అందుతుంది ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
'విశ్వంభర' ఓవర్సీస్ రైట్స్ 18 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మొత్తంలో ఓ సినిమాకు ఓవర్సీస్ హక్కుల ద్వారా ఇంత మొత్తం రావడం ఇదే మొదటిసారి. సీనియర్ హీరోలలో రూ.15 కోట్లకు పైగా ఓవర్సీస్ రైట్స్ అమ్ముడవ్వడం ఇప్పటివరకు జరగలేదు. ఇది కేవలం మెగాస్టార్ సినిమాకి మాత్రమే సాధ్యమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: