పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టి.. ఆ స్టార్ హీరో తో సినిమాకి రెడీ అయిన సుజిత్..!?

Anilkumar
 డైరెక్టర్ సుజిత్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమాను తెకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన 70% షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో కొద్దిరోజులు ఈ సినిమా షూటింగ్ వాయిదా వేశారు. కేవలం 15 రోజులు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే ఖచ్చితంగా సినిమా మొత్తం పూర్తయిపోతుంది. దాంతో ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఇక ఏప్రిల్ లో ఏపీ ఎన్నికలు పూర్తవుతాయి. వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను  రంగంలోకి దింపి సినిమాని పూర్తి చేసి ఆగస్టులో రిలీజ్ చేయాలి అని

 చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే సుజిత్ కి  సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగా డేట్స్ ఇవ్వడం కుదరదు. అందుకే ఈ గ్యాప్ లో దర్శకుడు సుజిత్ మరో హీరో తో  సినిమాను తీయాలి అని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నానితో సినిమా చేయాలని భావిస్తున్నారట. మాఫియా నేపథ్యంలోనే నానితో సినిమా తెరకెక్కించాలనుకున్నట్లు టాక్. ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయ్యిందట. దీనికి కూడా డివివి దానయ్య ప్రొడ్యూసర్ అని టాక్.

ఓజీకి కూడా ఆయన ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాని మూవీ ఓజి తర్వాతనే సెట్స్‌ పైకి వస్తుందని సమాచారం. కారణం నానికి ఇప్పటికే మూడు సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి. ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత బలగం వేణుతో సినిమా చేయబోతున్నాడు. మరోవైపు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఒద్దెలతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే త్రివిక్రమ్ కూడా ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట. ఈ నేపథ్యంలో సుజిత్ మూవీ ఎప్పుడు ఉంటుందనేది పెద్ద ప్రశ్నగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: