మన్నారా చోప్రాతో గొడవ, స్పందించిన శ్రద్ధా దాస్
శ్రద్ధ దాస్ కొద్ది రోజుల క్రితం ఇంటర్వ్యూలో మన్నారా చోప్రా తో తనకు మధ్య జరిగిన గొడవ గురించి చెప్పింది. 'జిద్' మూవీలో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాల్లో మన్నారా తనను నిజంగానే కొట్టిందని, ఆమె వల్ల గాయాలపాలయ్యానని తెలుపుతూ మన్నారా ప్రవర్తన పై విమర్శలు చేసింది. అంతేకాదు షూటింగ్ టైంలో మన్నారా ప్రవర్తనను తన సోదరీ ప్రియాంక చోప్రా కూడా సమర్థించిందని ఆ ఇంటర్వ్యూలో పేర్కొంది. దీంతో శ్రద్ధా దాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. దీంతో ఇది కాస్త వివాదంగా మారింది.
ఇక తాజాగా ఈ వివాదం పై స్పందించిన శ్రద్ధాదా తన ఇన్ స్టా స్టోరీ లో ఓ పోస్ట్ పెట్టింది." మన్నారా చోప్రాపై కానీ ఆమె ఫ్యామిలీ పై కానీ నేను ఏ మీడియా వ్యక్తికి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కనీసం నేను పర్సనల్PR ని కూడా పెట్టుకోలేదు. నేను కావాలనుకుంటే ఇన్ స్టాగ్రామ్ లో వీడియోని రిలీజ్ చేసి నాకు కావలసినంత పబ్లిసిటీ పొందుతాను. కానీ నేను అలాంటి పనులు చేయను. ఈ విషయంలో చాలా బాధపడ్డాను. కానీ వీటన్నింటికీ నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను" అని తన పోస్ట్ లో పేర్కొంది. దీంతో శ్రద్ధా దాస్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.