రెండు తెలుగు రాష్ట్రాల్లో దళపతి విజయ్ ఆఖరి 5 మూవీలకు వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ఇప్పటి వరకు తాను నటించడం ఎన్నో సినిమాలను తెలుగు లో విడుదల చేశాడు. అందులో కొన్ని మూవీ లు అద్భుతమైన విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాయి. ఇకపోతే ఈయన ఆఖరుగా తెలుగు.లో విడుదల చేసిన 5 మూవీ లకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
విజయ్ తాజాగా లియో అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు  ఈ సినిమా మంచి అంచనాల నడుమ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయింది. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటించగా ... లోకేష్ కనకరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 26.03 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
విజయ్ ఈ సంవత్సరం ప్రారంభంలో వారసుడు అనే మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15.05 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
విజయ్ కొంత కాలం క్రితం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన బీస్ట్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.33 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
విజయ్ కొంత కాలం క్రితం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.60 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మాళవిక మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
తలపతి విజయ్ కొంత కాలం క్రితం అట్లీ దర్శకత్వంలో రూపొందిన విజిల్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.57 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటించింది.
ఇకపోతే విజయ్ నటించిన ఆఖరి ఐదు సినిమాలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 74.58 కోట్ల కలెక్షన్ లను వసూలు చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: