ఖైదీ మూవీ సీక్వెల్ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన నటుడు?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త దర్శకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది డైరెక్టర్స్ మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. తమ డైరెక్షన్ తో ఇక ప్రేక్షకులందరినీ ఫిదా చేస్తూ స్టార్లుగా ఎదుగుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. ఏకంగా స్టార్ డైరెక్టర్గా ఎదిగిన వారిలో లోకేష్ కనకరాజ్ కూడా ఒకరు అని చెప్పాలి. ఏకంగా హాలీవుడ్ లో ఉండే మార్వెల్స్ సిరీస్ తరహా లోనే ఏకంగా సౌత్ లో కూడా ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్ ను తీస్తూ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తూ ఉన్నాడు లోకేష్ కనకరాజ్.

 ఖైదీ అనే సినిమాతో తన సినిమాటిక్ సిరీస్ ని మొదలుపెట్టి మొన్నటికి మొన్న విక్రమ్ అనే సినిమాకు కూడా లింకు పెట్టి అందరిలో ఆసక్తిని రేకెత్తించాడు. అయితే కార్తి హీరోగా నటించిన ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడు ఉంటుందో అని అటు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. త్వరలోనే ఖైదీ సీక్వెల్ ఉంటుందని ఇటీవల కార్తీ తాను నటించిన జపాన్ మూవీ ప్రమోషన్స్ లో కూడా చెప్పాడు.

 అయితే లోకేష్ కనకరాజ్ ఖైదీ మూవీ సీక్వెల్ గురించి ఇక ఖైదీ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన నరేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధించి లోకేష్ కనకరాజు తో షార్ట్ ఫిలిం పూర్తి చేశానని ఓ కార్యక్రమంలో చెప్పొచ్చాడు. అయితే రజనీతో అతని మూవీ పూర్తయిన తర్వాత ఖైదీ 2 షూటింగ్ ప్రారంభమవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం రజనీకాంత్ తో తీస్తున్న సినిమా కూడా తన సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధం ఉంటుంది అని అందరూ అనుకున్నప్పటికీ.. ఇది ప్రత్యేకమైన మూవీ అని లోకేష్ కనకరాజ్ క్లారిటీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: