నాగార్జున వెంకటేష్ మధ్య గ్యాప్ కి కారణం అదేనా....??

murali krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చి మంచి హీరో గుర్తింపు పొందిన హీరో నాగార్జున. ఇక ఈయన చాలా సినిమాలు చేస్తూ హీరో గా తనకంటూ ఒక మంచి గుర్తింపు పొందుతూ ముందుకు దూసుకెళ్లాడు.ఇక ఇదే క్రమం వాళ్ల తర్వాత జనరేషన్ గా వచ్చిన హీరో ల్లో నాగచైతన్య ఒకడు.అయితే నాగచైతన్య వరుసగా సినిమా చేసినప్పటికీ ఆయనకు సరైన సక్సెస్ అయితే పడడం లేదు... ఇక ఇదిలా ఉంటే దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వెంకటేష్ ...వెంకటేష్ కూడా అప్పట్లో చాలా సినిమాలు చేసి హీరో మంచి గుర్తింపు పొందాడు. ఇక ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కూడా కొట్టాయి.అయితే ఇలాంటి క్రమంలో వెంకటేష్ కి, నాగార్జునకి మధ్య చాలా సంవత్సరాల నుంచి మాటలు లేవన్న విషయమైతే మనందరికీ తెలిసిందే.
ఎందుకంటే వెంకటేష్ వల్ల సిస్టర్ అయిన లక్ష్మి ని నాగార్జున పెళ్లి చేసుకున్నాడు దాంతో నాగార్జున వెంకటేష్ ఇద్దరు బావ బామ్మర్దులు అయినప్పటికీ నాగార్జున నాగ చైతన్య పుట్టిన తర్వాత లక్ష్మి కి విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకున్నాడు.దాంతో అప్పటినుంచి నాగార్జునతో వెంకటేశ్ మాట్లాడటం లేదనే టాక్ అయితే బాగా స్ప్రెడ్ అయింది.   ఇక నాగచైతన్య హీరో వస్తున్న తండేల్ అనే సినిమా పూజ కార్యక్రమానికి వెంకటేష్ నాగార్జున ఇద్దరు కలిసి రావడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక నాగ చైతన్య అనుకున్నట్టుగానే వీళ్ళ ఇద్దరిని తన సినిమా ముహూర్తానికి తీసుకు వచ్చినప్పటికీ వీళ్ల మధ్య మాటలు పూర్తి స్థాయిలో కలిశాయా లేదా అనే విషయం ఇంకా క్లారిటీగా తెలియాల్సి ఉంది...ఇక ఈ సినిమాలో నాగ చైతన్య హీరో కాగా, సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంది.ఇక ఈ సినిమా మీద ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: