"మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కు తేదీ... వేదిక ఖరారు..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈయన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ తో మంచి విజయాన్ని అందుకొని నటుడి గా తనకంటూ ఓ మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్నాడు. ఇక ఆ తర్వాత జాతి రత్నాలు మూవీ తో తన క్రేజ్ ను మరింతగా పెంచుకున్నాడు. ఇకపోతే నవీన్ తాజాగా మహేష్ బాబు పి దర్శకత్వంలో యు వి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ , ప్రమోద్ లు నిర్మించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో అనుష్క హీరోయిన్ గా నటించింది.

ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యి మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ప్రి రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లాంజ్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకోవడం మాత్రమే కాకుండా ఇప్పటికే భారీ మొత్తంలో లాభాలను కూడా అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ ఇప్పటికే అద్భుతమైన విజయం సాధించడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ  బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ ను నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
 

ఈ మూవీ యొక్క బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు హోటల్ దాస్పల్ల , హైదరాబాదు లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఇప్పటికే తెలుగులో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను ఈ నెల 15 వ తేదీన మలయాళం లో కూడా విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం తాజాగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: