ఓకే ఓటీటీ లో రాబోతున్న జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి..!?

Anilkumar
ప్రస్తుతం థియేటర్స్ లో విడుదలైన సినిమాలు అన్నీ కూడా దాదాపుగా 45 రోజుల వ్యవధిలోని ఓటీటీ లోకి దర్శనమిస్తున్నాయి. విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ రెస్పాన్స్ వచ్చిన సినిమాలు దాదాపు రెండు నెలల తర్వాత వస్తున్నాయి. భారీ విజయాన్ని అందుకున్న సినిమాలైతే ఏకంగా 405 రోజుల్లోనే ఓటీటీ లోకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరొక రెండు సినిమాలు కూడా ఓటీటీ  లోకి స్రీమింగ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది. అయితే సెప్టెంబర్ 7న థియేటర్స్ లో విడుదలైన జవాన్ మరియు శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలు మంచి రెస్పాన్స్తో దూసుకుపోతున్నాయి.

ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే ఓటీడీలోకి రాబోతున్నాయి అన్న ప్రచారం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ఫ్లిస్ లో ఈ రెండు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది .చాలా కాలం తర్వాత అనుష్క హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. డైరెక్టర్ మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరోగా కనిపించాడు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో నా మురళీ శర్మ జయసుధ వంటి వారు కీలక పాత్రలో మెరిసారు.

కాగా సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటిసారి నవీన్ మరియు అనుష్క కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా లో తమ ఇద్దరి నటన అద్భుతంగా ఉంది అన్న టాక్ వినబడుతోంది. అయితే ఈ సినిమాకి గట్టి పోటీ ఇచ్చేందుకు జవాన్ సినిమా సైతం విడుదలైంది. బాలీవుడ్ బాద్ షారుక్ ఖాన్ నటించిన ఈ సినిమా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చింది. కాగా ఈ సినిమాలో లేడీస్ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించిన  ఈ సినిమా ట్రైలర్ పాటలతోనే ఈ సినిమాపై అంచనాలను పెంచేశారు. మొత్తానికి జవాన్ సినిమా ఊహించని విధంగా సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో ఈ రెండు సినిమాలు కూడా ఒకేసారి  ఓటీటీ లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: