అలాంటి రికార్డ్ కైవసం చేసుకున్న వెంకటేష్ మూవీ అదేనా ....!
ఉదయ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన 'కలిసుందాం..రా' సినిమాలో వెంకటేశ్ కు జోడిగా సిమ్రన్ నటించారు. అంతకుముందు ఈ మూవీ కోసం అంజలా జవేరి ని అనుకున్నారు. కానీ అనూహ్యంగా సిమ్రన్ కు అవకాశం ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని సిమ్రన్ ఉపయోగించుకున్నారు. ఈ సినిమాలో శ్రీహరి, రంగనాథ్, విశ్వనాథ్ శర్మ, రాళ్లపల్లి,బ్రహ్మానందం లాంటి లెజెండ్స్ నటించారు. కామెడీ, లవ్, యాక్షన్ ఇలా అన్ని కలగలిపి ఉన్న ఈ సినిమా ముందుగా 78 కేంద్రాల్లో మాత్రమే రిలీజ్ అయింది. అందుకు కారణం ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి 'అన్నయ్య' థియేటర్ లోకి రావడమే.మొదట్లో తక్కువ థియేటర్లలో రిలీజ్ అయినా ఆ తరువాత సినిమా గురించి తెలిశాక థియేటర్ల సంఖ్య పెరిగింది. అంతేకాకుండా చాలా థియేటర్లలో 50 రోజులు నడిచింది. ఇలా 14 సెంటర్లలో 175 రోజులు 4 థియేటర్లలో 200 రోజులు నడిచి రికార్డుల్లోకెక్కింది.ఇలా 200 రోజుల పాటు నడిచిన ఈ సినిమాకు మొత్తంగా 2 కోట్ల 50 వేల టిక్కెట్లు అమ్ముడు పోయాయి. ఈ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ బీట్ చేయలేదంటే మాటలు కాదు. సింపుల్ గా థియేటర్లోకి వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన ఏకైక సినిమాగా 'కలిసుందాం..రా' నిలుస్తుంది. ఇక ఈ సినిమాను రూ.4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. రూ.25 కోట్లు గ్రాస్ చేసింది.