చిరు అన్నయ్యా.. భోళాను చూసైనా బ్రో డాడీ ఆపేయ్ ప్లీజ్?

praveen
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే మొన్నటికీ మొన్న వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి ఇటీవల బోలా శంకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కోలీవుడ్ హిట్ మూవీ వేదాలం కు ఇది తెలుగు రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా నటించగా.. ఇక చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించిన మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉండేవి.

 అయితే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఈ సినిమా ఎందుకో అంచనాలను అందుకోలేకపోయింది అన్నది తెలుస్తుంది. ఇక మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంటుంది. కొంతమంది అయితే మెహర్ రమేష్ చిరంజీవితో చెత్త సినిమా తీశాడు అంటూ విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే చిరంజీవి రాజకీయాల నుంచి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా రిమేక్ సినిమాల పైన దృష్టి పెడుతూ ఉన్నారు. కానీ ఎందుకో రీమేకులు మాత్రం చిరంజీవికి అస్సలు అచ్చు రావడం లేదు.

 ఇలాంటి సమయంలోనే మెగాస్టార్ చిరంజీవిని అటు ఫ్యాన్స్ అందరూ కూడా ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేసుకున్నారు. చిరంజీవి అన్న ఇప్పటికైనా బ్రో డాడీ ఆపేయు అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందంటే ప్రస్తుతం చిరంజీవి మరో రీమేక్ కి రెడీ అవుతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నా బ్రో డాడీ సినిమా రిమేక్ చేసేందుకు చిరు ఒప్పుకున్నారట. ఈ సినిమాను సోగ్గాడే చిన్నినాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమా విషయంలో మెగా ఫాన్స్ కంగారుపడుతున్నారు. భోలా రిజల్ట్ చూసైనా ఈ బ్రో డాడి రిమేక్ ఆపేయండి అన్నయ్య అంటూ స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: