సోషల్ మీడియాకు తాప్సీ దూరంగా ఉండడానికి కారణం అదే....!!

murali krishna
రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి తాప్సీ.ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు.అయితే ఈమెకు తెలుగులో కాస్త అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి తాప్సి కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా కూడా ప్రేక్షకులను మెప్పించారు.ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాణ రంగంలో కూడా స్థిరపడినటువంటి ఈమె వరస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె ఈ మధ్యకాలంలో పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో తాప్సీ సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నారు.

ఈమె ఇలా సోషల్ మీడియాకు దూరం కావడానికి గల కారణాలను కూడా తాజాగా వెల్లడించారు.చాలా రోజుల తర్వాత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఈమెకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఇన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండడానికి కారణం ఏంటి అంటూ ప్రశ్నించారు నేటిజన్స్.అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పినటువంటి ఈమె తనకు ఒక్క క్షణం పాటు తీరిక లేదని వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండటం వల్లే తాను సోషల్ మీడియాకు దూరమయ్యాను అంటూ ఈ సందర్భంగా తాప్సి సోషల్ మీడియాకు దూరం కావడానికి గల కారణాలను తెలియజేశారు. ప్రస్తుతం ఈమె షారుక్ ఖాన్ తో కలిసి డంకీ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇలా షారుఖ్ ఖాన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అతనితో కలిసిన నటించడం వల్ల ఎన్నో విషయాలను నేర్చుకోగలము అంటూ తాప్సీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: