కాంతార చిత్రం మామూలుగా లేదు అంటున్న పూజా హెగ్డే..!!

murali krishna
కాంతార  చిత్రం ఇప్పుడు దేశవ్యా్ప్తంగా ప్రతిచోట వినిపిస్తున్న పేరు అనీ చెప్పొచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న గా విడుదలైన కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.
దీంతో ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేసింది హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ. ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ అందుకుంటూ భారీగా కలెక్షన్స్ రాబడుతుంది కాంతార. రిషబ్ శెట్టి స్వియ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు  బాగానే అందుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందంటూ ఇప్పటికే పలువురు నటీనటులు తమ అభిప్రాయాలను తెలిపారు. తాజాగా టాలీవుడ్ బుట్టబొమ్మ కాంతార కు  కూడా రివ్యూ ఇచ్చింది. ఈ అత్యద్భుతంగా ఉందని ఈ ముద్దుగుమ్మ పేర్కొంది.. ఓ ప్రాంతీయ సంస్కృతిని అందరికీ చేరువయ్యేలా తీర్చిదిద్దారని ఆమె అన్నారు. ఈ మేరకు తన ఇన్ స్టా వేదికగా కాంతార గురించి ఆసక్తిక కామెంట్స్ చేసింది.
' మీకు ఏం తెలుసో.. అదే కథగా రాయండి. మీ మనసుకు చేరువైన.. మీ హృదయంలో నుంచి వచ్చిన కథలనే ప్రేక్షకులకు చెప్పండి. ముఖ్యంగా ఈ లోని చివరి 20 నిమిషాలకు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. విజువల్స్, నటీనటుల ప్రదర్శనకు  నేను చలించిపోయా. రిషబ్ శెట్టి.. కాంతార విశేషమైన ఆదరణ పొందుతున్నందుకు గర్వంగా ఉంది. నా చిన్నతనంలో చూసిన భూతకోలని ఎంతో అద్భుతంగా చూపించి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నావు. రానున్న రోజుల్లో నువ్వు మరెన్నో ప్రశంసలు అందుకోవాలి. ' అంటూ రాసుకొచ్చారు పూజా హెగ్డే
ఈ సినిమా ను కర్ణాటక, కేరళలో విస్తరించి ఉన్న తుళునాడు ఆచారాలను ఆధారంగా చేసుకొని ఈ ను రూపొందించారు. స్థానిక గ్రామదేవతలను పూజించే భూతకోల సంస్కృతిని ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 190 కోట్లకు పైగా వసూళు చేసి 200 కోట్లకు చేరువలోనే ఉంది అని వివించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: