బస్ ఫైట్ సీక్వెన్సెస్ తో మొదలుకానున్న మహేష్ 28వ సినిమా..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరి కొన్ని రోజుల్లో ఒక మూవీ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ రెండవ వారం నుండి వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది . ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ ఫ్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీ గా ఉన్నట్లు తెలుస్తుంది .

ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించ నుండగా ,  పూజ హెగ్డే ఈ మూవీ లో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కనిపించ బోతుంది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ ని ఒక భారీ యాక్షన్ సన్నివేశం తో మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది . ఆ భారీ యాక్షన్ సన్నివేశం బస్ నేపథ్యంలో సాగనున్నట్లు సమాచారం . షూటింగ్ ప్రారంభాన్ని బస్ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్స్ సన్నివేశం తో మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది . ఈ యాక్షన్స్ సన్నివేశం ఈ మూవీ కి హైలైట్ గా నిలవ నున్నట్లు తెలుస్తుంది .

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ విషయం లో అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనుల విషయంలో చిత్ర బృందం పక్కా ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ పూర్తి అయిన వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు ,  దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: