ప్రపంచవ్యాప్తంగా మంచు లక్ష్మీకి అరుదైన గౌరవం?

Purushottham Vinay
సీనియర్ హీరో మోహన్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటన పరంగా టాలీవుడ్ లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించాడు. ఇక తండ్రి నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు మంచు లక్ష్మి. కేవలం నటిగానే కాకుండా సింగర్‌గా ఇంకా నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకున్నారు.ఇక అమెరికాలో ఉన్న సమయంలో కొన్ని హాలీవుడ్‌ సిరీస్‌లో నటించిన మంచు లక్ష్మి తర్వాత ఇండియాకు తిరిగొచ్చారు. అనంతరం 'అనగనగా ధీరుడు' సినిమాతో టాలీవుడ్‌ కి ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె అద్భుత నటనగాను కూడా నంది అవార్డును సైతం అందుకున్నారు.ఇక అంతేకాకుండా సింగర్‌గా కూడా మారి బెస్ట్‌ సెలబ్రిటీ సింగర్‌గా కూడా గామా అవార్డును సైతం అందుకుంది. ఇక సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే లక్ష్మీ.. సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది.ఇంకా అలాగే యూట్యూబ్‌లో కూడా సొంతంగా చానల్స్‌ నిర్వహిస్తూనే మరో వైపు సోషల్‌ మీడియాలో ఫిట్‌నెస్‌ ఇంకా అలాగే సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను కూడా తమ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది.


ఇలా నిత్యం ఏదో ఒక అంశంతో వార్తలో నిలిచే మంచు లక్ష్మి తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు. అతికొద్ది మందికి మాత్రమే లభించే అరుదైన గౌరవాన్ని ఆమె దక్కించుకున్నారు. టీసీ కండ్లెర్‌ అనే మ్యాగజైన్‌ ప్రతీ ఏటా కూడా 100 మోస్ట్‌ బ్యూటిఫుల్‌ ఫేసెస్‌ గ్లోబల్‌ జాబితాను విడుదల చేస్తుంది. ఇక తాజాగా లక్ష్మి మంచు ఇందుకు నామినేట్‌ అయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపడం జరిగింది.ఇంకా అలాగే తనను నామినేట్‌ చేసిందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆమె పోస్ట్‌ చేశారు. ఇక టీసీ కండ్లెర్‌ విషయానికొస్తే.. ఈ సంస్థ 1990 వ సంవత్సరం నుంచి కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉండే సినిమా, టీవీ ఇంకా పాప్‌ ఆర్టిస్ట్‌లకు ఈ జాబితాలో చోటు కల్పిస్తుంటారు.ఇక ఈ ఏడాదికి గాను తెలుగు నుంచి నటి మంచు లక్ష్మి చోటు దక్కించుకోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: