ప్రపంచంలోనే విలువైన వజ్రాన్ని బహుమతిగా పొందిన మిల్క్ బ్యూటీ..ఎవరిచ్చారంటే..!

Divya
మిల్క్ బ్యూటీ.. తమన్నా భాటియా.. ఈ ముంబై సుందరి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన నటనతో, అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది స్టార్ హీరోలతో కలసి నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. కేవలం హీరోలతో మాత్రమే కాకుండా వారి తండ్రు లతో కూడా కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ కాజల్ తర్వాత అంతటి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు దాటుతున్నా ఏ మాత్రం వన్నె తగ్గని అందంతో దూసుకుపోవడమే కాకుండా స్టార్ హీరోయిన్ రేంజ్ లో చలామణి అవడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోని ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది.
ఇక తమన్నా గురించి , ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్, కన్నడ , హిందీ భాషా చిత్రాలలో కూడా నటించి మెప్పించిన తమన్నా సుమారుగా రూ.150 కోట్లకు పైగా ఆస్తిని కూడబెట్టినట్లు కూడా సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా వైరల్ అవుతున్న విషయం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత విలువైన 5 వ అతిపెద్ద వజ్రం తమన్నా దగ్గర  ఉండడం గమనార్హం. ఇక ఈ వజ్రం ఈమె దగ్గర ఉండడం చూసి ఆమెకు ఈ వజ్రాన్ని ఎవరు ఇచ్చారు? ఎలా సొంతం చేసుకుంది? అనే విషయాలు కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి.. అసలు విషయం ఏమిటంటే మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొనిదెల తమన్నాకు ఎంతో ప్రీతిగా ఈ అరుదైన వజ్రాన్ని బహుమతిగా అందించిందట.
అంతేకాదు ఈ విషయాన్ని తమన్నా ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించడం జరిగింది. ఇక ఈ వజ్రం విలువ సుమారుగా రూ.2 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఇంత అరుదైన,  ఖరీదైన వజ్రాన్ని ఉపాసన బహుమతిగా ఇచ్చింది అంటే తమన్నా పై ఆమెకు ఎంత ఇష్టం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: