ఎన్టీఆర్ డబుల్ ధమాకా.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!

Anilkumar
ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనకి తెలిసిందే. అయితే గతంలో టెంపర్‌కు ముందు వరకు ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ డిజప్పాయింట్ అయిపోయారు.ఇకపోతే శక్తి, రామయ్యా వస్తావయ్యా, రభస లాంటి డిజాస్టర్ సినిమాలతో ఎన్టీఆర్ కెరీర్ పరంగా పాతాళంలోకి వెళ్లిపోయాడు.ఇక  తర్వాత కట్ చేస్తే ఆరు హిట్లు.. అందులో త్రిబుల్ ఆర్‌తో ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా ఇమేజ్ కూడా వచ్చేసింది.కాగా  ఇప్పుడు ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు.అయితే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల దృష్టంతా కొరటాల శివ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ సినిమాలపైనే ఉంది.

అయితే  కొరటాల సినిమా కంటే కూడా ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 2 సినిమాతో త్రిబుల్ ఆర్‌ను బీట్ చేసే సినిమా తెరకెక్కించడంతో ఇప్పుడు అందరూ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే సినిమా ఇండియా లెవల్లో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తుందనే అంటున్నారు.ఇకపోతే ఎన్టీఆర్ మాస్ యాక్టింగ్‌కు తోడు.. ప్రశాంత్ నీల్ విజువల్స్ తోడైతే ఇక ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పక్కర్లేదు. అయితే అసలు ఇది ఊహించుకోవడానికే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ సినిమా గురించి ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వినిపిస్తోంది.ఇక  ఈ సినిమాలో ఎన్టీఆర్ సింగిల్ రోల్ కాదట.. డబుల్ రోల్ చేస్తున్నాడట.

నిజంగా ఇది షాకింగ్ అప్‌డేట్ అనుకోవాలి.ఇదిలా ఉంటె ప్రశాంత్ నీల్ తీసిన బ్లాక్‌బస్టర్ కేజీయఫ్ 1, 2ల్లో యశ్‌ది సింగిల్ రోల్‌.కాగా  ఇప్పుడు ప్రభాస్ సలార్‌లోనూ సింగిల్ రోల్‌.. కానీ ఇప్పుడు ఎన్టీఆర్‌తో ఏకంగా డ్యూయెల్ రోల్ చేయిస్తున్నాడంటే కథలో ఖచ్చితంగా దమ్ము ఉండడంతో పాటు ప్రశాంత్ నీల్ మేకింగ్ మరింత కొత్తగా ఉంటుందనే అనుకోవాలి.అంతేకాదు  ఏదేమైనా అన్ని సమపాళ్లలో కుదిరితే ఇది మరో వండర్ ఫుల్ సినిమా అవుతుంది.పోతే నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ లోగా ప్రశాంత్ సలార్ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అయితే మరి ఎన్టీఆర్ సినిమాను కొరటాల ఎప్పటకి ఫినిష్ చేస్తాడన్నది కూడా కీలకం కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: