పక్కా కమర్షియల్ చిత్రంలో స్పెషల్ ఎట్రాక్షన్ ఈ మేనట..!!

Divya
టాలీవుడ్ హీరో గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం పక్కా కమర్షియల్. ఈ సినిమాని డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్-2 బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఇక త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 12న ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేయడం జరిగింది ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. సినిమాని మారుతి మార్కు కామెడీ గోపీచంద్ యాక్షన్ అంశాలతో తెరకెక్కించడం జరిగింది.

తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చాలా బాగా ఉండటంతో ఈ సినిమాకి ఒక రేంజ్ లో బజ్ ఏర్పడింది. సినిమా పక్కాగా సిద్ధం కావడంతో ఈ సినిమా జూలై 1న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్రబృందం. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల కోసం చిత్రబృందం పలు సంచలన విషయాలను తెలియజేసింది. సామాన్య ప్రేక్షకులు కూడా అందుబాటు ధరలో మీ టికెట్లు ఉంచే విధంగా నిర్ణయం తీసుకున్నది. భారీగా పెరిగిన ధరలు తగ్గించి అందుబాటు ధరలకు ఉంచుతామని బన్నీ వాసు కూడా ప్రకటించడం జరిగింది.
ప్రస్తుతం వరుస ఫ్లాపులతో గత కొంత కాలం నుంచి చాలా ఇబ్బందులు పడుతున్న హీరో గోపీచంద్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మారుతి అత్యంత కీలకంగా మారనుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్లకు ఈ సినిమా పై మరింత ఆసక్తి పెంచేలా చేసింది. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారుతొంది. ఈ సినిమాలో కీలక పాత్రలు వరలక్ష్మి శరత్ కుమార్ నటించబోతున్నట్లు గా తెలుస్తోంది..ఇ కథకు కీలకంగా ఉండే పాత్రలో. నేనింతే ఫ్రేమ్ శ్రియా గౌతమ్ నటించిందని మరొక హీరోయిన్ చిత్ర శుక్ల కూడా నటించిందని తాజా సమాచారం. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: