జనగణమన : పూరికి కేంద్రం నుంచి మైండ్ బ్లాకయ్యే షాక్!

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకొని ఈ ఏడాది ఆగస్టు నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది.ఇకపోతే ఎప్పటి నుంచో డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉన్నటువంటి పూరి జగన్నాథ్ జనగణమన సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేయాల్సి ఉంది.అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ మహేష్ బాబు చేయలేకపోవడంతో ఆ అవకాశాన్ని ఇక విజయ్ దేవరకొండ అందుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇంకా పోస్టర్ విడుదల చేయడంతో ఈ సినిమా ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కుతుందని తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాని కూడా పూరీజగన్నాథ్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని కూడా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఇన్వెస్టర్లతో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.




వీరి సూచనల ప్రకారం పూరి జగన్నాథ్ జనగణమన టీమ్ తో పాటు కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ను కలిసి ఈ సినిమాకి అప్రూవల్ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది.అయితే ఈ సినిమా కథ విన్న కేంద్ర ప్రభుత్వం ముంబై మహానగరాన్ని మిలిటరీ ఫోర్సులు చుట్టుముట్టే కథ కావడంతో భారతదేశ ప్రభుత్వం ఇంకా డిఫెన్స్ ఈ రెండూ కూడా ఈ సినిమాకు అప్రూవల్ ఇవ్వలేదు. దీంతో పూరి జగన్నాథ్ దెబ్బకి ఒక్కసారిగా షాకయ్యారు. అందుకే ఈ క్రమంలోనే ఈ సినిమా కథలో ఏవిధమైనటువంటి లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా కథను తయారు చేసే పనిలో పడ్డారు. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా కథ పూర్తి కావడానికి మరింత ఆలస్యం కావడంతో విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం తెలుస్తోంది.ఈ సినిమాలో టాలీవుడ్ ఐటమ్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: