విజయేంద్ర ప్రసాద్ తో రాజమౌళికి ఊహించని తలనొప్పులు !

Seetha Sailaja

రచయిత విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి దర్శకుడు అవ్వకముందే ఇండస్ట్రీలో ప్రముఖ రచయిత. ఆయన కథలలో ఒకనాటి టాప్ హీరోలు చాలామంది నటించారు. అవి ఏవి విజయేంద్ర ప్రసాద్ ను బ్లాక్ బష్టర్ సినిమాల రచయితగా నిలబెట్టలేకపోయాయి. అయితే రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ ల కాంబినేషన్ మొదలయ్యాక విజయేంద్ర ప్రసాద్ కథలు బ్లాక్ బష్టర్ సినిమాలుగా మారడమే కాకుండా ఆసినిమాలు వందల కోట్ల నుంచి వేలకోట్ల స్థాయికి ఎదిగిపోయాయి.

దీనితో విజయేంద్ర ప్రసాద్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి సెలెబ్రెటీగా మారిపోవడంతో అవకాశం చిక్కినప్పుడల్లా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇప్పుడు అలా ఇస్తున్న ఇంటర్వ్యూలు పరోక్షంగా రాజమౌళికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు ముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆమూవీలో జూనియర్ పాత్ర కంటే చరణ్ పాత్ర ఎక్కువ అని చెప్పి జూనియర్ అభిమానులకు కోపం తెప్పించాడు. దీనిని సరిదిద్దడానికి రాజమౌళి నానా పాట్లు పడవలసి వచ్చింది.

ఇప్పుడు త్వరలో మహేష్ తో తీయబోతున్న మూవీలో కూడ విజయేంద్ర ప్రసాద్ ఇస్తున్న లీకులు మరొక సంచలనానికి తెరతీస్తున్నాయి. ఈసినిమా బడ్జెట్ 800 కోట్లు పెట్టి రాజమౌళి తీయబోతున్నాడు అంటూ విజయేంద్ర ప్రసాద్ లీకులు ఇస్తున్నాడు. దీనితో ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. 400 కోట్ల బడ్జెట్ తో తీసిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ బయ్యర్లు ఈవారంతానికి కాని బ్రేక్ ఈవెన్ కు రాలేకపోతున్న పరిస్థితులలో 800 కోట్ల పెట్టుబడితో మహేష్ ను పెట్టి రాజమౌళి సినిమా తీస్తే ఆసినిమాకు 2000 కోట్లు గ్రాస్ కలక్షన్స్ రావలసి ఉంటుందని అలాంటి పరిస్థితి మహేష్ సినిమాకు ఉంటుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు మహేష్ తో తీయబోయే మూవీ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో నడిచే ఒక యాక్షన్ స్పై థ్రిల్లర్ అంటున్నారు. అలాంటి సినిమాలలో పెద్దగా సెంటిమెంట్ సీన్స్ అదేవిధంగా హాస్య సన్నివేశాలు ఉండే ఆస్కారం లేదు. ‘ఆర్ ఆర్ ఆర్’ లో హాస్యం సెంటిమెంట్ లోపించాయి అన్నకామెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాజమౌళి మహేష్ సినిమాను ఎలా తీస్తాడు అన్న ఆశక్తి అందరిలో పెరిగిపోతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: