ఓటీటీలో పుష్పను దాటేసిన రాధే శ్యామ్...!!

murali krishna
పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'రాధే శ్యామ్' బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. మార్చి 11న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షోతోనే భారీ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.

మార్నింగ్ షోల నుండీ మంచి టాకే వచ్చినప్పటికీ.. అప్పటికే బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అయిపోవడంతో సినిమా కలెక్షన్ల పై ప్రభావం పడిందట. అడ్వాన్స్ బుకింగ్ ల కారణంగా మొదటి వీకెండ్ ఈ మూవీ మంచి కలెక్షన్లను అయితే నమోదు చేసింది. కానీ ఆ తర్వాత చేతులెత్తేసింది.



తెలంగాణ వంటి ఏరియాల్లో టికెట్ రేట్లు అధికంగా ఉండడం, సినిమాకి కూడా నెగిటివ్ టాక్ రావడం వల్ల కలెక్షన్లు నమోదు కాలేదని తెలుస్తుంది.రూ.196 కోట్లకి ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ చేయగా ఫుల్ రన్లో ఈ మూవీ రూ.86 కోట్ల వరకే షేర్ ను నమోదు చేసి భారీ నష్టాలను మిగిల్చిందట.ఆ తర్వాత 'ఆర్.ఆర్.ఆర్' మూవీ థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వడంతో 'రాధే శ్యామ్' థియేట్రికల్ రన్ పూర్తిగా ముగిసినట్లయ్యింది. అటు తర్వాత 3 వారాలకే ఈ మూవీ ఓటిటిలో దర్శనమిచ్చిందట..

 

విడుదలకి ముందు నుండీ ఈ చిత్రానికి హైప్ బాగా ఉండడంతో నాన్ థియేట్రికల్ హక్కులు భారీ రేటుకి అమ్ముడయ్యాయని తెలుస్తుంది.. థియేట్రికల్ రన్ ముగిసింది కాబట్టి 3 వారాలకే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ విడుదలైందట. థియేటర్లలో మిస్ అయిన వాళ్ళంతా కూడా ఈ మూవీని ఎగబడి చూసినట్టున్నారు. అందుకే దెబ్బకి 'పుష్ప' రికార్డ్ కూడా బ్రేక్ అయ్యిందిగా మరి. 'రాధే శ్యామ్' మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన 2 గంటల 5 నిమిషాలకే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను రాబట్టిందట.

 

అంతకు ముందు ఈ రికార్డ్ 'పుష్ప' పేరుతో ఉండేది. 'పుష్ప' చిత్రం విడుదలైన 8 గంటల 22 నిమిషాలకు 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను నమోదు చేసిందట.. ఇప్పుడు ఆ రికార్డుని 'రాధే శ్యామ్' బ్రేక్ చేయడం గమనార్హం. '

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: