మహేష్ సినిమాలో విలక్షణ నటుడు..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమా లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే,  ఈ సినిమాకు గీతా గోవిందం  మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు,  ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను సర్కారు వారి పాట చిత్ర బృందం విడుదల చేయగా వీటి కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్ర మే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి.  సర్కారు వారి పాట మూవీ లో మహేష్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది, ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు,  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వ8టికీ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

 ఇది ఇలా ఉంటే మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే,  ఈ సినిమాలో మహేష్ బాబు సరసన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతోంది,  ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా పెళ్లి సందD బ్యూటీ శ్రీ లీల  నటించబోతోంది.  ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చబోతున్నాడు,  ఇది ఇలా ఉంటే మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది,  మహేష్ బాబు ,  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీ లో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది,  ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: