లైగర్ టీం న్యూ లుక్ మాములుగా లేదుగా..!!

murali krishna
లైగర్ టీమ్ అనుకోకుండా కనిపించి అందరికి సర్ప్రైజ్ ఇచ్చింది. బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో టీమ్ అంతా కూడా సందడి చేసింది.. సడెన్ గా అలా మీడియా ముందుకు దర్శనం ఇవ్వడంతో అందరు కూడా వారిని చూసి ఎంతో సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు

హీరో విజయ్ దేవరకొండ మరియు నిర్మాత ఛార్మి, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలిసి ఒకే డ్రెస్ కోడ్ లో కనిపించి కనువిందు చేసారు.వీరి లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రెసెంట్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా 'లైగర్' భారీ స్థాయిలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్న సంగతి తెలిసిందే.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరు ఎదురు చూస్తున్నారు. హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బాగా బిజీగా ఉంది. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో వీరు ముంబై లో ఎంతో హంగామా చేసారు.. అక్కడ టీమ్ అంతా కలిసి ఒకే డ్రెస్ కోడ్ వేసుకుని మీడియా ముందుకు వచ్చారట.ఇక ముంబై మీడియా విజయ్ ను చూసిన వెంటనే సర్ సర్ అంటూ వెంటపడి మరీ ఫోటోలు మరియు వీడియోలు తీశారు.

విజయ్ బ్లాక్ టక్స్ వేసుకుని ఎంతో అందంగా కనిపించాడు.. వీరంతా అపూర్వ మెహతా బర్త్ డే వేడుకలకు హాజరయ్యారట.. ఈ వేడుకలో పాల్గొన్న ఇతడి మీదనే అందరి కళ్ళు కూడా నిలిచాయి..ఇతడు చాలా స్టైలిష్ సూట్ లో ఎంట్రీ ఇచ్చి అభిమానుల హృదయాలను దోచుకున్నాడు.. అలాగే పూరీ, ఛార్మి కూడా బ్లాక్ అండ్ బ్లాక్ లో అదరగొట్టారు. లైగర్ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే టీం ప్రకటించారు.. దీని తర్వాత పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాను కూడా మళ్ళీ విజయ్ తోనే తీయాలని ఫిక్స్ అయ్యాడట.. ఈ సినిమా కూడా త్వరగానే సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: