బండ్లగణేష్ ఓ అభిమానితో ఫోన్లో మాట్లాడరంటూ సోమవారం ఓ ఆడియో క్లిక్ బయటికోచింది ఇక అదేంటి అంటే .... ‘నన్ను భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్కు రాకుండా అడ్డుకుంటున్నారు.అంతేకాదు నాకు రావాలని ఉన్నా త్రివిక్రమ్ రాకుండా చూస్తున్నారు.ఇక అటు వైసీపీ నేతలతో కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నారు’. ప్రస్తుతం ఈ ఆడియో క్లిక్ తెగ వైరల్గా మారిన విషయం తెలిసిందే.అయితే పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఈవెంట్స్లో తనదైన శైలిలో మాట్లాడుతూ అభిమానుల్లో జోష్ నింపే బండ్ల గణేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న వార్తలు వైరల్గా మారాయి.కాగా ఎవరి ఊహాగానాలు వారు సృష్టించారు.
అయితే అసలు బండ్ల గణేష్ విషయంలో ఏం జరుగుతుందన్న వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.కాగా ఇదిలా ఉంటే వైరల్ అవుతోన్న ఆడియో క్లిప్పై బండ్ల గణేష్ నుంచి వివరణ కోసం ఓ మీడియా ఛానెల్ ప్రయత్నించింది. ఇక ఈ విషయమై గణేష్ స్పందిస్తూ.. నెట్టింట వైరల్ అవుతోన్న ఆడియో తనది కాదని కొట్టి పారేశారు.కాగా ఈ విషయంపై నేను స్పందించను అంటూ తేల్చి చెప్పారు. ఇక దీంతో ఇప్పుడు ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది.అయితే ఒకవేళ బండ్ల గణేష్ మాట్లడకపోతే, ఈ ఆడియోను ఎవరు వైరల్ చేశారు.?లేక అసలు బండ్ల గణేష్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది.? అనే కోణంలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
ఇక ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై అటు త్రివిక్రమ్ కూడా స్పందించలేదు.అయితే బుధవారం జరగనున్న భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో ఈ విషయం ఏమైనా ప్రస్తావనకు వస్తుందేమో చూడాలి. ఇక ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకి యువ దర్శకుడు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పవన్ కి జోడిగా నిత్యమీనన్ అలాగే రాణా సరసన సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు...!!