సంగీతం ఈ సినిమా కథను ముందుకు తీసుకు వెళుతుంది... కిషోర్ తిరుమల..!

Pulgam Srinivas
టాలీవుడ్ హీరో శర్వానంద్ మరికొన్ని రోజుల్లో ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు,  ఈ సినిమాలో శర్వానంద్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది,  ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది,  దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.  రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు'  సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు,  ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ,  చిత్రలహరి,  రెడ్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి  విడుదల చేసిన ప్రచార చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి,  ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఫిబ్రవరి 25 వ తేదిన విడుదల కాబోతుంది.  ఇలా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదల సందర్భంగా ఈ సినిమా దర్శకుడు కిషోర్ తిరుమల తాజా ఇంటర్వ్యూలో అనేక విషయాలను తెలియజేశాడు,  అందులో భాగంగా కిషోర్ తిరుమల మాట్లాడుతూ... నాకు సంగీతం అంటే చాలా ఇష్టం,  సంగీతం వినకుండా స్క్రిప్ట్ ను రాయలేను. దేవి శ్రీ ప్రసాద్ అలరించే బాణీలను అందించాడు, పాటలు కూడా కథను ముందుకు తీసుకు వెళతాయి అని ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా దర్శకుడు కిషోర్ తిరుమల తెలియజేశాడు.  ఇది ఇలా ఉంటే ఇప్పటికే పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహా సముద్రం లాంటి వరస పరాజయాలతో డీలా పడిపోయి ఉన్న శర్వానంద్ కు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఎలాంటి విజయాన్ని తీసుకు వస్తుందో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: