అయ్యో: ఆ నటి తన మెట్టింట్లో అంత నరకం అనుభవించిందా..!!

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో బాయ్స్, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జెనీలియా. ఆమె తెలుగులో కొన్ని సినిమాలే చేసినప్పటికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలొయింగ్ తెచ్చుకున్న జెనీలియా అతి తక్కువ సమయంలోనే చిత్ర పరిశ్రమకి దూరమైంది. అయితే ఆమె ఇండస్ట్రీకి దూరం కావడానికి ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వడమే దీనికి కారణం అనే చెప్పాలి మరి. ఇక జెనీలియా బాలీవుడ్ యాక్టర్ రిషితేశ్ దేశ్‌ముఖ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇక జెనీలియా భర్త రిషితేశ్ దేశ్‌ముఖ్ నటుడిగా మాత్రమే కాకుండా ఒక ముఖ్యమంత్రి తనయుడు అని అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే జెనీలియాకి రిషితేశ్ దేశ్‌ముఖ్‌తో పరిచయం ఏర్పడి అనంతరం అది ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. కాగా వీరిద్దరికి వివాహం జరిగిన తరువాత జెనీలియా మెట్టినింట్లో మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని సమాచారం.
అయితే జెనీలియా రిషితేశ్ దేశ్‌ముఖ్ ప్రేమలో ఉన్నారనే విషయం తెలియగానే.. అతని తండ్రి వీరి పెళ్లికి అంగీకారం తెలుపలేదు. అందుకు ప్రధాన కారణం ఏంటంటే.. వీరిద్దరిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కావడమే కాకుండా వీరి మతాలు కూడా వేరు కావడంతో వీరి పెళ్లికి విలాస్ రావ్ ఒప్పుకోలేదని సమాచారం. అంతేకాక ఒకానొక సమయంలో ఈయన జెనీలియా తల్లిదండ్రులకు కూడా బాగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
కాగా.. చివరికి వీరిద్దరికి పెళ్ళైన తర్వాత జెనీలియా మొదట్లో ఇలాంటి కష్టాలను ఎన్నో అనుభవించిందని సమాచారం. అంతేకాదు.. జెనీలియా ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లిగా మారి తన భర్తతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు అనే విషయం అందరికి తెలిసిన విషమయే. ఇక ఇదిలా ఉండగా.. ఆమె ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. జెనిలియా సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుందని తెలిసి ఫ్యాన్స్ కూడా తెగ సంబర పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: