ఆ విషయంలో మంచు ఫ్యామిలీని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్...!

murali krishna
టాలీవుడ్ ను గత కొన్ని రోజులుగా వేధిస్తున్న ఏపీ టిక్కెట్ల రేట్ల వ్యవహారానికి ఒక పుల్‌ స్టాప్ పడే అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. నేడు చిరంజీవి ఆధ్వర్యం లో మహేష్ బాబు ప్రభాస్,, కొరటాల శివ అలాగే రాజమౌళి, ఆర్ నారాయణ మూర్తి ఇంకా ప్రముఖులు వెళ్లి అమరావతి లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలవడం జరిగిందని అందరికి తెలుసు..

ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి నుండి కచ్చితమైన హామీ సినీ ప్రముఖులకు వచ్చినట్లుగా సమాచారం.. అతి త్వరలోనే టికెట్ రేట్ల పెంపు విషయమై ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని.. జీవో ను విడుదల చేస్తామని చిరంజీవి టీంకి జగన్ హామీ ఇచ్చాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ వారు మరియు సోషల్ మీడియా వర్గాల వారు మంచు ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. అవి ఏంటి అంటే ఈ సమయంలో మోహన్ బాబు ఎక్కడ ఉన్నాడబ్బా టికెట్ల రేట్లు విషయంలో ఒక్కరు ఇద్దరు వెళ్లి మాట్లాడడం కాదు మొత్తం ఇండస్ట్రీ ప్రముఖులు వెళ్లి మాట్లాడాలి అంటూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయట. చిరంజీవితో పాటు ఎందుకు వెళ్ళలేదు అంటూ మోహన్ బాబు ని కొందరు ప్రశ్నిస్తున్నారట.చిరంజీవి కంటే ముందు మోహన్ బాబు ఈ సమస్య కు ఒక పరిష్కారం తీసుకొచ్చి ఉండాల్సిందని అప్పుడు కచ్చితంగా నీవే ఇండస్ట్రీ పెద్ద అయ్యే వాడివి కదా అంటూ మరి కొందరు తెగ కామెంట్ చేస్తున్నారు.ఇక ఇటీవల మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు అందరికీ బాగా గుర్తుండే ఉంటాయి.

చిరంజీవి ఒక్కడే వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే అది ఆయన వ్యక్తిగత విషయం అవుతుందని ఇండస్ట్రీ కి సంబంధించిన విషయం ఎలా అవుతుంది అంటూ వ్యాఖ్యలు చేశాడట.. ఇప్పుడు చిరంజీవి ఆధ్వర్యంలో ప్రభాస్, మహేష్ బాబు వెళ్లారు కదా . ఇప్పుడు కూడా ఆ భేటీ వ్యక్తిగత విషయమేనా మంచు విష్ణు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. టిక్కెట్ల రేట్లు పెంపు విషయము మెగా కాంపౌండ్ కి క్రెడిట్ దక్కకూడదనే ఉద్దేశం తో మంచు ఫ్యామిలీ చేసిన ప్రయత్నాలు అన్ని ఫెయిల్ అయ్యాయి. వాళ్ళకే తిరిగి విమర్శలు తప్పలేదట మోహన్ బాబు మరియు మంచు విష్ణు ఇప్పటికైనా ఈగో వదిలేసి ఇండస్ట్రీతో కలిసిపోవాలని ఇండస్ట్రీ పెద్ద అయినా చిరంజీవి ని గౌరవించాలి అని మెగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: