రౌడీ బాయ్స్ ఓటిటి విడుదల ఎప్పుడు... అక్కడ అంటే..?

Pulgam Srinivas
ప్రస్తుతం ఓటిటి ల ప్రాముఖ్యత ఏ రేంజ్ లో పెరిగిందో మనందరికీ తెలిసిందే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాను థియేటర్ లోకి వెళ్లి చూడడం కంటే కుటుంబంతో కలిసి ఓటిటి లో సినిమా చూడటం మంచిది అని కొంతమంది భావిస్తూ ఉండడంతో ఓటిటి ఫ్లాట్ ఫామ్ లకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇలా జనాల్లో ఓటిటి లపై క్రేజ్ పెరగడంతో ఓటిటి సంస్థల మధ్య పోటీ కూడా అదే రేంజ్ పెరిగిపోయింది,  కొన్ని ఓటిటి సంస్థలు  సినిమాలను నేరుగా తమ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లలో భారీ మొత్తం వెచ్చించి కొని  స్ట్రీమింగ్ చేస్తున్నాయి, అలాగే  కొన్ని సినిమాలు థియేటర్ లలో విడుదల అయిన తర్వాత కూడా ఆ సినిమాలను ఓటిటి లో స్ట్రీమింగ్ చేయడానికి ఓటిటి సంస్థలు పోటీపడుతున్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే టాక్ ను సంపాదించుకున్న రౌడీ బాయ్స్ సినిమా మార్చి 4 వ తేదీ నుండి జీ ఫైవ్  ఓటిటి లో స్ట్రీమింగ్  కానున్నట్లు తెలుస్తుంది, ఆశిష్ రెడ్డి హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ డ్రామా సినిమాకు శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు, ఈ సినిమా ఇప్పటికీ జంట తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో రన్ అవుతోంది. ఈ సినిమా థియేటర్‌లలో విడుదలైన 50 రోజుల లోపు ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ చేసే విధానం ఈ చిత్ర నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఈ యూత్ ఫుల్ డ్రామా సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: