యంగ్ హీరోతో పవర్ స్టార్ మల్టీ స్టారర్... ఇది కదా మజా?

VAMSI
రీ ఎంట్రీ ఇచ్చాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఒకవైపు రాజకీయ రంగంలో బిజీగా ఉంటూనే మరో వైపు వరుస భారీ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు. 'వకీల్ సాబ్' మూవీ ఇచ్చిన హిట్ తో వరుస విజయాలను ఖాతాలో వేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబోలో తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీ 'భీమ్లా నాయక్' షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఆ తరువాత కూడా లైన్ లో వరుసగా ప్రాజెక్ట్ లు ఉన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా మరో మల్టీ స్టారర్ మూవీకి పవన్ ఒకే చెప్పినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.
అందులోనూ అది క్రేజీ కాంబినేషన్ అని వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ హీరోతో పవన్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇంతకీ పవర్ స్టార్ చిత్రంలో పవన్ తో  కలసి స్క్రీన్ షేర్ చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవరు అంటే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి అని తెలుస్తోంది. 'జాతి రత్నాలు' సినిమాతో ఒక్కసారిగా తన గ్రాఫ్ ను పెంచుకున్న ఈ హీరో ఇపుడు పవన్ తో కలసి నటించే ఛాన్స్ కొట్టేశాడని వార్తలు వినపడుతున్నాయి. గతంలో కూడా పవర్ స్టార్ 'గోపాల గోపాల' వంటి మల్టీ స్టారర్ మూవీ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.
ప్రస్తుతానికి ఈ వార్త చిత్రసీమలో షికారు చేస్తోంది. దీనిపై ఒక స్పష్టత రావాలంటే అటు పవర్ స్టార్ నుండి కానీ ఇటు నవీన్ నుండి కానీ ఏదైనా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక పవన్ తాజా చిత్రం భీమ్లా నాయక్ మూవీ ఈ సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా...పలు కారణాల వలన శివరాత్రి పండుగకు షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: