బిగ్ బాస్ 5: 25 లక్షలు తీసుకొని రేస్ నుండి తప్పుకున్న స్టార్ కంటెస్టెంట్...!

murali krishna
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే మరికొద్ది గంటల్లో ప్రసారం కానుందట.హోస్ట్ నాగార్జున ఫైనల్ కోసం బాలీవుడ్, టాలీవుడ్ కి చెందిన టాప్ సెలబ్రిటీలను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తుంది.
ఆర్ఆర్ఆర్ స్టార్ క్యాస్ట్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్, అలియా భట్ తో పాటు శ్యామ్ సింగరాయ్ టీమ్ నాని మరియు సాయి పల్లవి అలాగే కృతి శెట్టి వేదిక పంచుకోనున్నారని తెలుస్తుంది.అయితే ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కాగా ఆసక్తికర విషయాలు లీక్ కావడం జరిగిందట.ఉత్కంఠగా సాగిన ఫైనల్ లో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.
కాగా బిగ్ బాస్ సీజన్ 5లో ఫైవ్ లో కూడా సీజన్ 4 సీన్ రిపీట్ అయినట్లు సమాచారం.స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరిన సింగర్ శ్రీరామ్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇచ్చారని తెలుస్తుంది.. ఆయన నాగార్జున ఆఫర్ తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకున్నారని తెలుస్తుంది.. సీజన్ 4 ఫైనల్ లో హారిక మరియు అరియానా ఎలిమినేషన్ అనంతరం టైటిల్ కోసం అభిజీత్, అఖిల్ అలాగే సోహైల్ పోటీపడ్డారట.అయితే ఈ దశలో టైటిల్ గెలుస్తామనే నమ్మకం లేనివారు రూ. 25 లక్షలు తీసుకొని వెళ్లిపోవచ్చని ఒక ఆఫర్ ఇచ్చారట.ఈ ఆఫర్ ని సోహైల్ అంగీకరించడం జరిగిందట రూ. 25 లక్షలతో ఆయన రేసు నుండి తప్పుకున్నారని సమాచారం.
ఇక నేటి బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ లో ఇలాంటి సంఘటనే జరిగిందని తెలుస్తుంది.సింగర్ శ్రీరామ్ హోస్ట్ నాగార్జున ఆఫర్ చేసిన రూ. 25 లక్షలు తీసుకుని పోటీ నుండి తప్పుకున్నారని సమాచారం.సిరి మరియు మానస్ లకు 5,4 స్థానాలు దక్కాయని సమాచారం.. వీరిద్దరి ఎలిమినేషన్ అనంతరం టైటిల్ రేసులో సన్నీ, శ్రీరామ్ మరియు షణ్ముఖ్ నిలిచారట.

ఈ దశలో నాగార్జున రూ. 25 లక్షలు ఆఫర్ చేశారని తెలుస్తుంది.. ముగ్గురిలో ఒకరికి డబ్బులు తీసుకొని రేసు నుండి తప్పుకునే ఛాన్స్ ఉందని చెప్పగా… శ్రీరామ్ డబ్బులు తీసుకొని టైటిల్ పోరు నుండి విరమించుకున్నారని తెలుస్తుంది.. శ్రీరామ్ నిష్క్రమణతో టైటిల్ రేసులో సన్నీ మరియు షణ్ముఖ్ మిగిలారట.. వీరిలో అత్యధిక ఓట్లు సంపాదించిన సన్నీ విన్నర్ గా టైటిల్ అందుకోగా… షణ్ముఖ్ రన్నర్ గా మిగిలాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: