దసరా తర్వాతే అంటున్న వెంకటేష్..!

Pulgam Srinivas
విక్టరీ వెంకటేష్ హీరోగా , మీనా హీరోయిన్ గా క్రియేటివ్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దృశ్యం టు. సినిమా మలయాళం దృశ్యం టు కు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ కూడా ఇప్పటికే వచ్చేసిం ది. అయితే ఈ సినిమాను మొదట ఓ టి టి లో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అదేమీ లేదు ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది దానికి ప్రధాన కారణం నారప్ప  సినిమా ఓ టి టి లో విడుదల అవడం వల్ల వెంకటేష్ అభిమానులలో నిరాశ కలిగింది. ఈ సినిమాను థియేటర్లలో విడుదల  చేయబోతున్నారు అంటూ కూడా వార్తలు బయటకు వచ్చాయి.

కానీ ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం దృశ్యం టు సినిమాను కూడా నారప్ప సినిమా ను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను మొదట తారాకు స్విమ్మింగ్ చేయాలి అనుకున్న అది కుదరనట్లు అందుకే ఈ సినిమాలు దసరాకు కాకుండా ఆ తర్వాత స్ట్రీమ్మింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్త పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా మాతృక అయిన మలయాళ దృశ్యం టు కూడా థియేటర్లలో కాకుండా నేరుగా ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్విమ్మింగ్ అయ్యింది. ఈ ఈ సినిమాను దృశ్యం ను మించిన సస్పెన్స్ థ్రిల్లర్ అని ప్రశంసలను దక్కించుకుంది. మరి తెలుగులో కూడా దృశ్యం  మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరి దృశ్యం టు ఎంత విజయం సాధిస్తుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: