''మాణికే మాగే హితే''... ప్రస్తుతం సోషల్ మీడియాని బాగా షేక్ చేస్తూ చాలా ఎక్కువగా వినిపిస్తోన్న పాట.ఇక ఈ పాట ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇంకా యూట్యూబ్ షార్ట్స్...ఇలా ఎక్కడ చూసినా కాని ఈ పాట అనుకరణలు అలాగే కవర్ సాంగ్లే మనకు కనిస్తున్నాయి. ఈ పాటలోని లిరిక్స్ ఇంకా భావం అసలేం అర్థం కాకపోయినా ఆ పాట పాడిన అమ్మాయి హస్కీ వాయిస్ మాత్రం మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది. ఇలా తన చక్కని ఇంకా శ్రావ్యమైన గొంతుతో అలరిస్తోన్న ఆ గాయని విషయానికి వస్తే ఆమె పేరు యొహానీ డిలోకా డిసిల్వా.ఇక ఈ పాటను యొహానీ సింహళ భాషలో పాడటం జరిగింది.అందుకే ఆ పాట చాలా మందికి అర్థం లేదు.కానీ యొహానీ గొంతు ఇంకా అలాగే ఆ పాటలో ఆమె చూపించిన ఎక్స్ప్రెషన్స్ కారణంగా ఈ పాట దేశ సరిహద్దులు దాటి మంచి ఆదరణ అనేది దక్కించుకుంటుంది.యూట్యూబ్లో ఈ పాటని ఇప్పటివరకు 9 కోట్ల మందికి పైగా వీక్షించారంటే ఈ పాట ఎంత ఆకర్షించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండియాలో అయితే ఈ పాట తెగ మార్మోగిపోతోందనే చెప్పాలి.ఇక దేశంలోని అన్ని భాషలైన హిందీ, తమిళ, పంజాబీ, మలయాళ సంగీత కళాకారులు తమ భాషల్లోకి ఈ పాటని రీమిక్స్ చేసి మరీ ఈ పాటను ఆస్వాదిస్తున్నారు.
ఇక దేశం గర్వించదగ్గ నటుడు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఈ పాటకు ఫిదా అవ్వడం జరిగింది.ఇక ఇందులో భాగంగానే తన సినిమాలోని ఓ పాటను ఈ సాంగ్తో మిక్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.ఇలా ఈ ఒకే ఒక్క పాటతో ఈమె ఇంటర్నేషనల్ స్టార్గా మారిపోయింది.
ఇక ఈ 28 ఏళ్ల యొహానీ శ్రీలంక రాజధాని కొలంబోకి చెందినది. ఈమె తండ్రి ప్రసన్న డిసిల్వా ఆర్మీలో మేజర్ జనరల్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందడం జరిగింది.ఈమె తల్లి దినితి డిసిల్వా శ్రీలంకన్ ఎయిర్లైన్స్లో ఒక ఎయిర్హోస్టెస్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇక అలాగే యొహానీకి షవింద్రి అని ఓ చెల్లి కూడా ఉంది. తండ్రి ఉద్యోగం కారణంగా చిన్నప్పుడే శ్రీలంకలోని చాలా ప్రాంతాలను చుట్టేసింది యొహానీ. ఇక అదే సమయంలో సంగీతంపై ఆమె బాగా ఆసక్తిని పెంచుకుంది. ఇక ఆమె తల్లి కూడా తనను బాగా ప్రోత్సహించడంతో అందులోనే తన కెరీర్ చూసుకుంది. మొదట యూట్యూబర్గా తన కెరీర్ను ప్రారంభించిన ఈ చిన్నది ‘దేవియాంగే బేర్’ అనే ర్యాప్ సాంగ్తో బాగా గుర్తింపు పొందింది. ఇక ఇవే కాదు.ఈమె పాడిన కవర్ సాంగ్స్ అన్ని కూడా జనాల్లోకి బాగా వెళ్లాయి.ఇక ఈ క్రమంలోనే శ్రీలంక ‘ర్యాప్ ప్రిన్సెస్’ అని ఆమెకు ఓ బిరుదుని కూడా ఇవ్వడం జరిగింది.ఇక ఈమె పాడిన పాటలకి చాలా అవార్డులు, పురస్కారాలు కూడా వస్తున్నాయి. యొహానీ సాంగ్స్లో ఒక పాట రాయగమ్ సోమ్ అవార్డు వేడుకలో ‘ఉత్తమ వీడియో రీమేక్’ అవార్డు కూడా గెల్చుకోవడం విశేషం. ఇక గత సంవత్సరం ‘ఆయే’ అనే పాట పాడి దానితో మరోసారి తన గాన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది ఈ సింగింగ్ సెన్సేషన్.ఈ పాటని ఆమె తన సొంత స్టూడియోలో అలాగే తన నిర్మాణ సారథ్యంలో రూపు దిద్దుకోవడం అనేది విశేషం. ఇక ఈ సంవత్సరం విడుదలైన ‘మాణికే మాగే హితే’ పాట అయితే ఎలాంటి సంచలనాలని నమోదు చేస్తుందో మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక ప్రస్తుతం సింహళ భాషలో 12 పాటలతో ఓ ఆల్బమ్ రూపొందించే పనిలో ఉందీ ఈ యంగ్ అండ్ డైనమిక్ గాయని. ఈ సంవత్సరం చివరలో లైవ్ కన్సర్ట్ను కూడా ఏర్పాటుచేసి ఈ ఆల్బమ్ను విడుదల చేయబోతుంది.