క్లాస్ ని మాస్ ని మెప్పించిన కుటుంబకథ చిత్రం "బొమ్మరిల్లు"
అయితే ఈ సినిమాలో హీరోగా ముందుగా సిద్ధార్థ్ కంటే ముందు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లకు ఈ కథ చెప్పాడంట బొమ్మరిల్లు భాస్కర్. కానీ ఎందుకో ఇద్దరికి ఈ సినిమా కథ నచ్చలేదు.కానీ అల్లు అర్జున్ కి బొమ్మరిల్లు భాస్కర్ కథ చెప్పిన పద్ధతి నచ్చింది అందుకే వెంటనే బొమ్మరిల్లు భాస్కర్ తో పరుగు సినిమాని లైన్ లో పెట్టాడు అల్లు అర్జున్.ఈ సినిమాకి మొదటి వేరే టైటిల్స్ చాలానే అనుకున్న కూడా బొమ్మరిల్లు టైటిల్ ని దిల్ రాజు ఫైనల్ చేశాడు. 120 రోజుల షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేయగా భాస్కర్ 105 రోజుల్లోనే పూర్తి చేసి ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా 7 కోట్లతో తెరకెక్కిస్తే 25 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ ని షాక్ చేసింది.అలాగే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ క్యారెక్టర్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇక హాసినిగా జెనీలియా చేసిన పర్ఫార్మెన్స్ అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఈ సినిమాలో ప్రతి పాట అప్పటినుంచి ఇప్పటికి చార్ట్ బస్టరే .