అడవి శేష్ కోసం పవర్ ఫుల్ స్టోరీ సిద్ధం ... ఊకొడతారా ?

VAMSI
యంగ్ అండ్ ఎనర్జిటిక్ టాలెంటెడ్ హీరో కం రైటర్ అడవి శేష్ ఎప్పటికప్పుడు భిన్నమైన కాన్సెప్టులను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు క్రియేట్ చేసుకున్నాడు.
మోస్ట్ టాలెంటెడ్ హీరోగా రాణిస్తున్న ఈ కుర్ర హీరో ప్రస్తుతం  మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ యొక్క జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. జూలై 2న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా బ్రేక్ పడింది. అయితే అడవి శేష్ తదుపరి ప్రాజెక్టు గురించి ఓ తాజా వార్త అభిమానులను తెగ ఉర్రూతలూగిస్తోంది.

 
టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి హీరో అడవి శేష్ కోసం ఓ స్పై క్రైం థ్రిల్లర్ కథను రెడీ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో ఓ పవర్ఫుల్ లైన్ తీసుకొని స్టోరీ రాశారట సురేందర్ రెడ్డి. కాగా ఈ సినిమాలో హీరోగా వైవిధ్య భరిత పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన అడవి శేష్ అయితే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని భావిస్తున్నారట దర్శకుడు. కానీ ఈ కథ ఇంతవరకూ అడవి శేష్ కు చెప్పలేదని తెలుస్తోంది. మరి డైరెక్టర్ సురేందర్ రెడ్డి రెడీ చేసిన ఈ స్టోరీని అడవి శేష్ ఓకే చేస్తారో లేదో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా నిజమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికార ప్రకటన వచ్చే వరకు పూర్తి క్లారిటీ లేదనే చెప్పాలి.

 ఇటీవలె టాలెంటెడ్  డైరెక్టర్ సురేందర్ రెడ్డి అఖిల్ ప్రధాన పాత్రలో ఏజెంట్ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత అఖిల్ ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో  అడవి శేష్ మూవీ తెరకెక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే లాక్ డౌన్ తరువాత ఈ కాంబినేషన్ గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: