దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభన కొనసాగుతుంది. కాస్త తగ్గినా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. దాంతో ఆక్సీజన్ మరియు రెమిడిసివిర్ మందుల కొరత తీవ్రంగా ఏర్పడింది. అయితే వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసకురావడానికి ప్రభుత్వాలు ఎంతవరకూ పని చేస్తున్నాయో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరంలేదు. కానీ రియల్ హీరో సోనూసూద్ మాత్రం తన సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఎంతో మంది వలస కూలీలకు అండగా నిలిచిన సోనూ ప్రస్తుతం ఎంతోమంది ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కేసులు వేగంగా పెరుగుతున్న కారణంగా సోనూసూద్ తన టీమ్ తో కలిసి ఎంతో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మందికి ఆక్సిజన్ మరియు కరోనా మందులను సమయానికి అందించిన సోనూసూద్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీకు ఆక్సీజన్ ఇస్తానని సోనూసూద్ అంటున్నారు. ఆక్సీజన్ ను కొనలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్లు తమను సంప్రదించాలని సోనూసూద్ చెబుతున్నారు.
సంప్రదించిన వారికి వెంటనే ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్ లను అందిస్తామని చెబుతున్నారు. అందు కోసం సోనూ సూద్ ఇప్పటికే ఫ్రాన్స్ తో పాటు ఇతర దేశాలకు ఆర్డర్లు ఇచ్చారు. అయితే డిల్లీలో కేసులు పెరుగుతున్న కారణంగా మొదట వారికి సరఫరా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అందుకోసం వారికి ఆక్సీజన్ అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాము. ఆక్సీజన్ కాన్సంట్రేటర్ అవసరం ఉన్నవాళ్లు ఈ నెంబర్ (022-61403615) కు మిస్ట్ కాల్ ఇవ్వండి. మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టేషన్ చేసుకోవాలి. ఆక్సీజన్ కాన్సంట్రేటర్ లు వస్తున్నాయి. త్వరలో మరిన్ని ప్రాణాలను కాపాడుకుందాం.ఈ సేవలు పూర్తిగా ఉచింతం. అంటూ సోనూ తెలిపారు. ఇదిలా ఉండగా సోనూసూద్ ఇటీవలే కరోనా థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని నాలుగు ఆక్సీజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు మరో మంచి నిర్ణయం తీసుకుని ప్రశంసలు పొందుతున్నారు.