ప్రభాస్ సినిమాకి అక్షరాలా రూ. 700 కోట్లు .... ఇంతకీ ఏ మూవీ కంటే .... ??

GVK Writings
రెబల్ స్టార్ ప్రభాస్, ప్రస్తుతం ఈ పేరు మన దేశంతో పాటు దేశవిదేశాల్లోని ఆడియన్స్ లో కూడా మారుమ్రోగుతోంది. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు సినిమాల భారీ సక్సెస్ లతో హీరోగా అతి పెద్ద విజయాలు అందుకుని విపరీతమైన క్రేజ్, మార్కెట్, పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఆపై సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఆ మూవీ లో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించగా యువి క్రియేషన్స్ వారు దానిని భారీ లెవెల్లో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించారు.
అయితే సాహో అనంతరం ప్రస్తుతం వరుసగా పలు పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం పూజ హెగ్డే తో కలిసి ఆయన చేస్తున్న రాధేశ్యామ్ మూవీ ఆల్మోస్ట్ షూట్ మొత్తం పూర్తి చేసుకుని జులై 30న విడుదలకు రెడీ అవుతోంది. అలానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ తో పాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో చేస్తున్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ కూడా వేగంగా షూట్ ని జరుపుకుంటోంది. కాగా వీటిలో సలార్ వచ్చే ఏడాది సమ్మర్ లో అలానే ఆదిపురుష్ వచ్చే ఏడాది ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఈ మూడు సినిమాల అనంతరం అతి త్వరలో నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ వారు నిర్మించనున్న భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో ప్రభాస్ నటించనున్న విషయం తెలిసిందే.
దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్ర చేయనున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ టాలీవుడ్ వర్గాలను షేక్ చేస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందనున్న ఈ మూవీ కి కళ్ళు చెదిరే రేంజ్ లో దాదాపుగా రూ. 700 కోట్లకు పైగా బడ్జెట్ ని ఖర్చు చేయనున్నారని, ఇప్పటికే దీనికి సంబంధించి రామోజీ ఫిలిం సిటీ లో కొన్ని భారీ సెట్స్ యొక్క రూపకల్పన జరుగుతోందని అంటున్నారు. కాగా ఈ సినిమా జులై లో పట్టాలెక్కి, వచ్చే ఏడాది చివర్లో ఆడియన్స్ ముందుకు రానుందని సమాచారం. మరి ఈ న్యూస్ కనుక వాస్తవం అయితే, ఏకంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ మూవీ అత్యధిక బడ్జెట్ మూవీ గా రికార్డులకెక్కడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: