ఆ నిర్మాణ సంస్థతో సినిమా వద్దంటున్న పవర్ స్టార్ ఫ్యాన్స్...

Purushottham Vinay
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల తరువాత 'వకీల్ సాబ్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసాడు పవన్ కళ్యాణ్.దిల్ రాజు నిర్మించిన ఆ సినిమాని వేణు శ్రీ రామ్ డైరెక్ట్ చెయ్యడం జరిగింది. ఇక ఆ సినిమా విడుదలయ్యి మంచి టాక్ ని సంపాదించుకుంది.ఇక ఈ సినిమా తరువాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. 'అయ్యప్పనుమ్‌ కొషియమ్‌' రీమేక్‌, 'హరి హర వీరమల్లు' చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇవి కాకుండా హరీశ్‌ శంకర్‌ డైరక్షన్‌లో ఒకటి, సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మరొకటి ఒప్పుకున్నాడు.వీటితోపాటు జేబీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ మీద ఓ సినిమా చేయడానికి పవన్‌ అంగీకరించాడని సమాచారం అందుతుంది.అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు, ఎప్పుడు ప్రారంభం లాంటి సమాచారం మాత్రం లేదు. అయితే 2022లో కచ్చితంగా పవన్‌తో సినిమా చేస్తామని జేబీ ఎంటర్‌టైన్మెంట్స్‌ చెబుతోంది.

సాయిధరమ్‌ తేజ్‌తో 'రిపబ్లిక్‌' సినిమా తీస్తున్న సంస్థే జేబీ ఎంటర్‌టైన్మెంట్స్‌. ఈ నిర్మాణ సంస్థ ఇండస్ట్రీకి కొత్తేం కాదు. తెలుగు చిత్ర సీమకు బాగా పరిచయం ఉన్న భగవాన్‌, పుల్లారావు కలసి కొత్తగా ఏర్పాటు చేసిన బ్యానర్‌ ఇది. 'బాలాజీ ఆర్ట్‌ మీడియా' పేరుతో ఓ బ్యానర్‌ పెట్టి గతంల కొన్ని హిట్ సినిమాలు తీశారు. అయితే 'రెబల్‌' లాంటి డిజాస్టర్‌లు తీసి చేతులు కాల్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు 'రిపబ్లిక్‌'తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆ సినిమా త్వరలో విడుదల కావాల్సి ఉన్నా… కరోనా కారణంగా వాయిదా వేయనున్నారు.అలాంటి నిర్మాణ సంస్థతో పవన్ సినిమా చేస్తుండడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట. ఎందుకంటే గతంలో ప్రభాస్ తో తీసిన రెబల్ సినిమా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఇక పవర్ స్టార్ తో కూడా ఆ ప్లాప్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమోనని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: