మహేష్ బాబు సినిమాలో పూజ హెగ్డే.. మరో మహర్షి అవుతుందా..?
అయితే ఇక ఆ తర్వాత ఈ అమ్మడు చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయం సాధించడంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది పూజా హెగ్డే. ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో బిజీ బిజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. స్టార్ హీరోల సినిమాలకు పూజాహెగ్డే కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అయితే కేవలం దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది పూజా హెగ్డే. అయితే ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలో మరోసారి పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసిన ట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమాలో పూజ హెగ్డే నటించి తన నటనతో అందచందాలతో ఆకట్టుకుంది.
ఇక మహర్షి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. మరోసారి మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తెలుస్తుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా రానుండగా ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డేను ఎంపిక చేశారట. యాక్షన్ ఎంటర్టైన్మెంట్తో పాటు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హీరోయిన్ గా ఇప్పటికే పూజా హెగ్డే అని చిత్రబృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో అతడు ఖలేజా సినిమాలు రాగా ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే .