హమ్మో.. మాస్ హీరో సినిమా అన్నికోట్ల ధర పలికిందా..??

N.ANJI
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో అజిత్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అజిత్ గురించి తమిళ స్టార్ హీరో అయినా అజిత్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఆయన సినిమాలు దాదాపుగా తెలుగులో డబ్ వెర్షన్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఆ విధంగా అజిత్ తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నాడు.
ఇక ప్రస్తుతం అజిత్ కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'వాలిమై'. ఈ సినిమాలో అజిత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పాన్ ఇండియా వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి. అజిత్ చివరిగా బాలీవుడ్ పింక్ రీమేక్ 'నీర్కొండ పార్వయ్' సినిమాలో కనిపించాడు.
అంతేకాదు.. ఆ సినిమాను తెరకెక్కించిన హెచ్. వినోద్ ఇప్పుడు వాలిమై సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోణికపూర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో హ్యుమా ఖురేషి కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమా నుండి ఇంకా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు. కానీ సోషల్ మీడియాలో వాలిమై ప్రీ-రిలీజ్ బిజినెస్ కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే తమిళనాట వాలిమై హక్కులు 70కోట్ల వరకు ధర పలికినట్లు టాక్. ఇదేగనక నిజమైతే.. ఈ లెక్కన వాలిమై సినిమా థియేట్రికల్ హక్కులు భారీ ధరకే అమ్ముడయ్యాయని చెప్పవచ్చు అని చిత్ర పరిశ్రమలో పలువురు గుసగుసలు అనుకుంటున్నారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఆగష్టులో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: