శ్రీకారం మూవీ ఫలితంతో కృష్ణ వంశీ అన్నం కు సమస్యలు !

Seetha Sailaja
దర్శకుడు కృష్ణవంశీ మహాశివరాత్రి  నాడు ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అనే కొత్త సినిమాని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన  టైటిల్ పోస్టర్ వైవిధ్యంగా ఉండటంతో ఈ మూవీ పై అప్పుడే చర్చలు మొదలు అయిపోయాయి. అరిటాకు పై అన్నం మెతుకులు వేట కొడవలి మంగళ సూత్రం రక్తం మరకలతో మరోసారి కృష్ణవంశీ మార్క్ ఈ మూవీ లో కనిపిస్తుందని అప్పుడే ఊహా గానాలు మొదలైపోయాయి.  

ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోష్టర్ విడుదల అయి ఒక్క రోజు కాకుండానే ఈ మూవీ కథ గురించి ఇప్పుడు మరొక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. తెలుస్తున్న సమాచారం మేరకు 'అన్నం' కథ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆలోచన కాదని గతంలో కృష్ణవంశీ బాలకృష్ణ తో  తీయాలని ప్రయత్నించిన ‘రైతు’ సినిమా కథే ‘అన్నం’ మూవీగా మారిందని అంటున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీలో హీరోగా నటించమని కృష్ణ వంశి ఒక సీనియర్ హీరో పై ఒత్తిడి చేస్తున్నాడు అంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం  కృష్ణవంశీ లేటెస్ట్ మూవీ ‘రంగమార్తాండ’ రిలీజ్ అయి  దాని ఫలితం తెలిస్తే కాని ఈ ‘అన్నం’ పరిస్థితి తేలదు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో కృష్ణవంశీని నమ్మి ‘అన్నం’ సినిమా చేసే స్టార్ హీరో ఎవరు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తిక చర్చలు జరుగుతున్నాయి.  

ప్రస్తుతం కృష్ణవంశీ తన తన ఇమేజ్ కోల్పోయి చాలా ఏళ్లయింది. ‘చందమామ’ తరువాత అతడికి ఒక హిట్ కుదారాలేదు.  ఎన్ని ప్రయత్నాలు చేసినా కృష్ణవంశీ నేటితరం ప్రేక్షకులకు తగ్గట్టుగా సినిమాలు తీయలేక పోతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ‘రంగమార్తాండ’ రిలీజ్ కాకముందే కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేసి దానికి స్టార్ హీరోతో తీయాలని కృష్ణవంశీ ఆశించడం మితిమీరిన ఆశ మాత్రమే అవుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: