పవన్ కొత్త సినిమాకు ముహుర్తం కుదిరింది... అప్పుడే అనౌన్స్..
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి అయింది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా ఉన్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. శృతిహాసన్, అంజలి, నివేథా థామస్, అనన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను హిందీ మూవీ పింక్కు రీమేక్గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఆ టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. తాజాగా వకీల్సాబ్ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్ డేట్ను చిత్ర బృందం అఫిషీయల్గా ప్రకటించేసింది.
ఈ ఏడాది ఏప్రిల్ 9న ఈ సినిమాను థియేటర్లలో వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ అప్టేట్తో పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు. కాగా... ఈ సినిమా తర్వాత పవన్ మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్ల రాజకీయ ప్రయాణం చేశాక ఇటీవలే తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వరుస సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా అటు రాజకీయాలు, ఇటు సినిమా షూటింగ్స్ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు పవన్.