22న ‘జీనియస్’ ఆడియో విడుదల

Prasad
టీవీ రంగంలో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ ప్రస్తుతం  జీనియస్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథను ప్రముఖ కథా రచయిత చిన్నికృష్ణ అందిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా జరుపుకొంటుంది. దాదాపుగా 12 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, ఈ నెల 22న జీనియస్ సినిమా ఆడియోను విడుదల చేస్తున్నారు. ప్రముఖులు హాజరయ్యే ఈ వేడుకను ఘనంగా జరపటానికి చిత్ర యూనిట్ కృషి చేస్తుంది. ఈ జీనియస్ సినిమాలో హవీశ్, అశ్విన్, సానుష, అభినయ ముఖ్యపాత్రలల్లో నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: