మహేష్ బాబు సడన్ ముంబై ట్రిప్ వెనుక అసలు రహస్యం ఇదే .... ??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్వరలో తెరకెక్కనున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. నిజానికి ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్  అమెరికాలో ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అక్కడ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటంతోపాటు యూనిట్లోని కొందరికి వీసా సమస్యలు తలెత్తడంతో తొలి షెడ్యూల్ ని దుబాయ్ లో ప్లాన్ చేశారు మూవీ యూనిట్. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ నెల 25న సర్కారు వారి పాట తొలి షెడ్యూల్ దుబాయ్ లో ఎంతో గ్రాండ్ లెవల్లో ప్రారంభం కాబోతున్న ట్లు తెలుస్తోంది.
అక్కడే దాదాపుగా ఇరవై రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుందని అనంతరం హైదరాబాద్ ఆపై అమెరికా, జార్జియా దేశాల్లో మూడు భారీ షెడ్యూల్స్ తర్వాత సినిమా ముగుస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా షెడ్యూల్స్ విషయమై యూనిట్ పక్కా ప్రణాళిక సిద్ధం చేసిందని సమాచారం. ఇక నేడు మధ్యాహ్నం తన ఫ్యామిలీతో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకంగా ముంబై బయలుదేరి వెళ్లారు. ఇటీవల పలు యాడ్స్ లో వరుసగా నటిస్తున్న మహేష్ ప్రస్తుతం ముంబై వెళ్లడానికి కారణం కూడా మరొక ప్రతిష్టాత్మక సంస్థ యాడ్లో నటించడానికి అని సమాచారం. ఇక సర్కారు వారి పాట మూవీ లోని తన క్యారెక్టర్ కోసం ఫుల్ గా క్రాఫ్ పెంచిన మహేష్ మేకోవర్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్త తీసుకొని బాగా ఫిట్ గా సిద్ధమయ్యారు.
ఇక మరోవైపు ఆయన నటించనున్న సర్కారు వారి పాట షూటింగ్ కి ఇంకా సమయం మిగిలి ఉండటంతో పలువురు యాడ్ ఏజెన్సీల వారు ఈ గ్యాప్ లో ఆయన లుక్ ని తన యాడ్స్ కోసం వాడుకునేందుకు సిద్ధమవుతున్నారు.  ఇక మహేష్ బాబు మరొక మూడు రోజులపాటు ముంబై లోనే బస చేస్తారని యాడ్ షూటింగ్ ముగిసిన అనంతరం హైదరాబాద్ తిరిగి వచ్చి 24వ తేదీన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ బయలుదేరుతారని అంటున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే అటు సినిమాలని, ఇటు యాడ్స్ ని పక్కాగా బ్యాలెన్స్ చేస్తూ మంచి జోష్ తో కొనసాగుతున్నారు సూపర్ స్టార్......!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: