ప్రభాస్ ఆదిపురుష్ లో సీనియర్ హీరోయిన్...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ‌ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అన్నీ సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలు కావడం విశేషం.. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లి పెద్ద స్టార్ అవ్వడంతో కోట్లలో ఖర్చు పెట్టి ఆయనతో సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమా 'ఆదిపురుష్' అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో మరో ముఖ్యపాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్‌ని తీసుకున్నారని తెలుస్తోంది. ఆమె సైఫ్ అలీ ఖాన్‌కు జోడీగా నటించే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. కాజోల్ రోల్ సినిమాకే మేజర్ అట్రాక్షన్ అవుతుందని బాలీవుడ్ వర్గాల మాట. ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

 ఇక ఈ భారీ సినిమాలో ప్రభాస్ జోడీగా బ్యూటీ కృతి సనన్ నటించనుందని సమాచారం. అదేవిధంగా లక్ష్మణుడి పాత్ర కోసం మరో బాలీవుడ్ స్టార్ సన్నీ సింగ్‌ని ఫైనల్ చేశారని తెలుస్తోంది.ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి... 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: