పవన్ తో మరొకసారి నటించనున్న అజ్ఞాతవాసి భామ .....??

GVK Writings
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా అజ్ఞాతవాసి. కీర్తి సురేష్, అను ఇమ్మానియేల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించగా పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందించారు. పవన్ కళ్యాణ్ కెరీర్ 25 సినిమాగా రెండేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. వాస్తవానికి అంతకుముందు పవర్ స్టార్ మరియు త్రివిక్రమ్ ల కలయికలో తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమాలు రెండూ కూడా ఒకదానిని మించి మరొకటి భారీ విజయాలు అందుకుని వారిద్దరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ తెచ్చి పెట్టడం జరిగింది.
దానితో తదుపరి వారిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన మూడో సినిమా అజ్ఞాతవాసి పై పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో ఒక్కసారిగా అందరి ఆశలు నిరాశలు అయ్యాయి. ఇకపోతే ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించిన అను ఇమ్మానియేల్ అతి త్వరలో మరొక సారి పవర్ స్టార్ సరసన నటించనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. కాగా పలు ఫిలిం నగర్ వర్గాల నుండి మా ఏపీ  హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ప్రస్తుతం వకీల్ సాబ్ తో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న పవర్ స్టార్ వాటి అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా తో పాటు ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
కాగా సురేందర్ రెడ్డి సినిమాలోని పవన్ కి జోడీగా అను నటించనుందని అంటున్నారు. మంచి యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అను ఇమ్మానియేల్ పాత్ర అదిరిపోతుందని తప్పకుండా కెరీర్ పరంగా ఆమెకు ఈ సినిమా మంచి సక్సెస్ ని అందిస్తుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి ఆ మూవీ యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: