విజయ్ దేవరకొండ: ఎలక్ట్రిక్ వెహికల్స్ వ్యాపారంలో పెట్టుబడులు
ఈ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్స్ - స్కూటర్లను నగరవాసులకు బాడుగకు అందుబాటులో ఉంచుతుంది. శుక్రవారం నాడు తెలంగాణా స్టేట్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమ్మిట్ లో వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ ప్రతినిధులు మరియు విజయ్ దేవరకొండ తదితరులు ఈ కార్యక్రమంలో లో పాల్గొని పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ భవిష్యత్ లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల రానున్న తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందుతుందని పేర్కొన్నారు.
ఈ కంపెనీ అందించే వాహనాలకు ప్రయాణించే దూరాన్ని బట్టి రెంట్ చెల్లించి ఉపయోగించుకోవచ్చు. ఈ ఎలక్ట్రికల్ వాహనాల వలన కాలుష్యం తగ్గడంతో పాటు సమయం మరియు డబ్బు ఆదా అవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ వంటి భారీ జనాభా ఉన్న అభివృద్ధి చెందుతున్న నగరాలలో.. ప్రజలకు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు అవసరమైనప్పుడు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు . ఈ సేవలు త్వరలోనే జంట నగరాల్లో ప్రారంభమవుతాయని తెలుస్తోంది.... ఇలా మన విజయ్ దేవరకొండ మరో కొత్త బిజినెస్ తో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా తనేంటో తెలియజేశాడు.