ప్రియుడితో కాజల్ అగర్వాల్... సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్...!

Anilkumar
టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోయిన్ లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండ్రస్టీ కి వచ్చి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ తన స్టార్ డం ను కొనసాగిస్తూనే ఉంది కాజల్. టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటె ఇప్పుడు ఈ అందాల తార అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ విషయాన్ని కాజల్ స్వయంగా ప్రకటించడం విశేషం.

గత కొంత కాలంగా ఓ వ్యాపార వేత్త తో సన్నిహితంగా ఉన్న కాజల్.. ఇప్పుడు తాజాగా అతడినే పెళ్లాడబోతోంది.  ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగానే ఉన్న కాజల్ ఈ నెలలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ముంబైకి చెందిన పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకోబోతోంది.తాజాగా వీరికి సంబంధించిన పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికీ ఎప్పట్నుంచో పరిచయం ఉందని ఈ ఫొటోల ద్వారా స్పష్టమవుతోంది. వీరిద్దరూ ఎప్పట్నుంచో స్నేహితులని ఆ తర్వాత ప్రేమికులుగా మారారని సమాచారం. అయితే కాజల్ స్వయంగా ప్రకటించే వరకు వీరి రిలేషన్ షిప్ గురించిన వార్తలు బయటకు రాలేదు.ఈ నెల 30 తేదీన వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే.

వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని కాజల్ స్పష్టం చేసింది.దీనికి తన ప్రియుడు గౌతమ్ కూడా సుముఖత వ్యక్తం చేయడంతో.. పెళ్లి తర్వాత కూడా కాజల్ వరుసగా సినిమాలు చేస్తూ.. మళ్ళీ టాలీవుడ్ లో తన స్టార్ డం ను కొనసాగించనుందని తెలుస్తోంది.ఈఇక ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది కాజల్. తమిళంలో విజయ్ సరసన తుపాకీ సీక్వెల్ లో కూడా కాజల్ అగర్వాల్ నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: