మారుతి పరిస్థితి ఏంటి.. ఇలా అయిపోయింది..?

NAGARJUNA NAKKA
దర్శకుడు మారుతి అయోమయంలో మునిగిపోయాడు. అనుకున్న ప్లాన్ లో ఫైనల్ స్టేజ్ వరకు వెళ్లి డిసప్పాయింట్ అవుతున్నాడు. టాప్ హీరోలు, యంగ్ స్టర్స్ ఇలా ఎవ్వరినీ ప్రయత్నం చేసినా వర్కవుట్ కావడం లేదు. దీంతో తర్వాత ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నాడు మారుతి.


లాక్ డౌన్ కి ముందు నుంచీ హీరోల కోసం ప్రయత్నం చేస్తున్నాడు మారుతి. కానీ అన్ లాక్ 4.0 వచ్చినా మారుతి ప్రయత్నాలకు మాత్రం ఫుల్ స్టాప్ పడటం లేదు. అల్లు అర్జున్ నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరకు చాలామందితో సినిమా చేస్తాడనే ప్రచారం జరిగినా ఒక్క ప్రాజెక్ట్ కూడా కన్ఫర్మ్ కాలేదు. దీంతో డైరెక్షన్ కి బ్రేక్ ఇచ్చి ప్రొడక్షన్ పై ఏకాగ్రత పెడుతున్నాడట మారుతి.

‘ప్రతి రోజూ పండగే’ సినిమా తర్వాత మారుతి, అల్లు అర్జున్ కోసం ప్రయత్నం చేస్తున్నాడనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రయత్నం వర్కవుట్ కాలేదు. తర్వాత రామ్ తో సినిమా అని టాక్ వచ్చింది. మొన్న బెల్లంకొండతో డిస్కషన్స్ జరిగాయనే టాక్ కూడా వచ్చింది. కానీ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు మారుతి. అయితే హీరోలు దొరక్కపోవడంతో కొత్తవాళ్లతో సినిమా నిర్మించాలనుకుంటున్నాడట మారుతి.

మారుతి నిర్మాతగా కొన్ని చిన్న సినిమాలు నిర్మించాడు. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా సినిమాలు చేశాడు. అయితే ఫ్యామిలీ డైరెక్టర్ అనే ఇమేజ్ వచ్చాక నిర్మాణాన్ని తగ్గించి, డైరెక్షన్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అయితే మళ్లీ ఇప్పుడు బ్రేక్ రావడంతో నిర్మాణం వైపు అడుగులేస్తున్నాడని తెలుస్తోంది. యూత్ ని అట్రాక్ట్ చేసే వెబ్ సీరీసులు కూడా ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి మారుతిని హీరో కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఆరునెలల నుంచి ప్రయత్నం చేస్తున్నా.. ఆయన అనుకుంది సక్సెస్ కావడం లేదు. చేసేది ఏం లేక ఓటీటీల్లో వెబ్ సిరీస్ లకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: