సుశాంత్ సింగ్ ఆత్మహత్య.. అవకాశం ఇచ్చిన నా మీద కేసు పెడతారా అంటూ ఏక్తాకపూర్ పోస్ట్..?
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం బాలీవుడ్లో సంచలనం గా మారిపోయింది. ఇప్పటికి కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య పై ఎన్నో అనుమానాలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఒకసారి గా బాలీవుడ్ చిత్ర పరిశ్రమను సుశాంత్ సూసైడ్ కదిలించింది అని చెప్పాలి. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని ప్రతీ పాత్రలో ఒదిగిపోయి నటించి గొప్ప నటుడిగా ఎదిగారు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ పై ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులు సంచలన వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
బంధుప్రీతి కారణంగానే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అంటూ కంగనా రనౌత్ ప్రకాష్ రాజ్ అభినవ్ కశ్యప్ లాంటి సినీ ప్రముఖులు బాహాటంగానే చెప్పకనే చెప్పారు దీంతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య పై జరుగుతున్న చర్చ మరింత హీటెక్కించే అనే చెప్పాలి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ కరణ్ జోహార్ ఏక్తా కపూర్ ల పై ప్రస్తుతం ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు.
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి ఇండస్ట్రీకి పరిచయం చేసింది తానే అనే విషయాన్ని గుర్తు చేశారు. పవిత్ర రిష్తా అనే ధారావాహిక లో ప్రధాన పాత్రలో సుశాంత్ కి అవకాశం ఇచ్చేందుకు చానల్ వాళ్లు ఒప్పుకోకపోయినప్పటికీ వారిని ఒప్పించి సుశాంత్ కి లీడ్ రోల్ ఇప్పించింది తానే అని కొన్ని రోజుల కింద పేర్కొన్న విషయం తెలిసిందేm అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి నటుడిగా ఎదిగేందుకు అవకాశం ఇచ్చిన తనపై కేసు నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉంది అంటూ తాజాగా వ్యాఖ్యానించారు . ప్రస్తుతం సుశాంత్ కుటుంబం దుఃఖంలో మునిగి పోయింది అని ప్రస్తుతం వారిని ప్రశాంతంగా ఉండనివ్వండి అంటూ వ్యాఖ్యానించారు.కాగా సుశాంత్ మరణానికి కరణ్ జోహార్ సల్మాన్ ఖాన్ ఏక్తా కపూర్ తో పాటు మరో తొమ్మిది మంది బాలీవుడ్ ప్రముఖులు కారణం అంటూ బీహార్ ముజఫర్ కోర్టులో కేసు నమోదైన విషయం తెలిసిందే.