కేజీఎఫ్2 రిలీజ్ పై హీరో యశ్ క్లారిటీ..!

Murali

యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన సినిమా కేజీఎఫ్. కన్నడనాట తెరకెక్కిన ఈ సినిమా జాతీయస్థాయిలో అద్భుత విజయం సాధించి అటెన్షన్ కు గురి చేసింది. దీంతో ఇప్పుడు కేజీఎఫ్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న కేజీఎఫ్2పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాపై కొన్ని ఊహాగానాలు వినవస్తున్నాయి. ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై సినిమా హీరో యశ్ పూర్తి క్లారిటీ ఇచ్చాడు.

 

రీసెంట్ గా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో హీరో యశ్ మాట్లాడుతూ.. ‘కేజీఎఫ్2 ను ఓటీటీల్లో విడుదల చేసే ప్రశ్నే లేదు. ఈ సినిమాను బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ లో తెరకెక్కిస్తున్నాం. సినిమాపై అభిమానుల అంచనాలు ఏస్థాయిలో ఉన్నాయో నాకూ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు తెలుసు. సినిమాను అదేస్థాయిలో ఉంటుంది. అభిమానులు ధియేటర్లోనే ఎంజాయ్ చేస్తారు’ అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో ధియేటర్లు తెరవడంలో ఆలస్యమైతే సినిమా ఓటీటీలో విడుదలవుతుందంటూ ఇటివల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో యశ్ ఫుల్ క్లారిటీ ఇచ్చి గాసిప్స్ కు ఎండ్ కార్డ్ వేసేశాడు.

 

కేజీఎఫ్ సాధించిన విజయంతో సీక్వెల్ పై జాతీయస్థాయిలో అంచనాలు ఉన్నాయి. సినిమాలో మెయిన్ విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ చేయడంతో సినిమా రేంజ్ ఇంకా పెరిగిపోయింది. కోలార్ గనుల నేపథ్యంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించి ఉంటే ఈ ఏడాదే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ.. అనుకోని ఉపద్రవం కరోనా వచ్చి ప్రేక్షకులు, అభిమానుల ఆశలపై నీళ్లు జల్లేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా రివీల్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: